టీమిండియా జట్టు సారథి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణి రిటైర్ మెంట్ ప్రకటించారు. టెస్టు క్రికెట్ నుంచి తాను తక్షణం తప్పుకుంటున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు. అస్ట్రేలియాలో జరుగుతున్న బార్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే ధోణి తన నిర్ణయాన్ని ప్రకటించారు. మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో భారత్ డ్రా దిశగా పయనించడంతో మహేంద్ర సింగ్ ధోణి తన నిర్ణయాన్ని ప్రకటించారు. అటు క్రికెట్ అభిమానులు, భారత అభిమానులను ఆశ్చర్యంలో ముంచుతూ ధోణి అనూహ్యంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు.
అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కెరీర్ లో మొత్తం 90 టెస్టులు ఆడిన ధోని 59.11 స్ట్రైక్ రేట్ తో 4876 పరుగలను తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిల్లో ఆరు శతకాలు, 33 అర్థశతకాలు నమోదు చేశారు. టెస్టు క్రికెట్ లో ఆయన అత్యంత ప్రతిభ కనబర్చి సాధించిన అత్యుత్తమ స్కోర్ గా 224 పరుగులు నమోదకాగా, కీపర్ గా 90 టెస్టులో 256 క్యాచ్ లు పట్టారు. ఇటీవల శ్రీలంక వికెట్ కీపర్ సంగక్కర పేరున నమోదైన రికార్డును బద్దలు కొడుతూ ఆయన టెస్టు క్రికెట్ లో 38 స్టంపింగ్ లు చేశారు. దోణ నిర్ణయంతో నాలుగో టెస్ట్ సారధ్య బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారు. అయితే వన్డేలు, టీ 20 మ్యాచ్ లపై తన దృష్టిని కేంద్రీకరించే పనిలో భాగంగానే తాను టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు దోణి చెప్పాడు.
తన నుంచి టెస్టు క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలను అందుకోనున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలో జట్లు మరింతగా విజయపథంలో నడవాలని ఆయన ఆకాంక్షించారు. ధోణి నిర్ణయాన్ని బీసీసీఐ కూడా క్షణాల్లోనే అంగీకారం తెలిపింది. ధోణి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ అమోదాన్ని తెలిపింది. అస్ట్రేలియాలో జరుగుతున్న అలెన్ బార్డర్-గవాస్కర్ టెస్టు సీరీస్ లో భాగంగా జనవరి ఆరు నుంచి సిడ్నీలో జరగనున్న చివరి (నాల్గవ) టెస్టుకు కెప్టెన్ గా వీరాట్ కోహ్లీని ప్రకటించింది. ధోణి భారత జట్టు టెస్ట్ క్రికెట్ కు చేసిన సేవలను కోనియాడింది.
భారత గోప్ప కెప్టెన్లలో ఒకరు మహేంద్ర సింగ్ ధోణి
భారత జట్టు సారధిగా పగ్గాలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోణి తనదైన ప్రతిభతో టెస్టు క్రికెట్ లో భారత్ ను నెంబర్ వన్ స్థానంలో నిలపగలిగారు. మొన్నటిదాకా విజయవంతమైన కెప్టెన్గా మన్ననలందుకున్న ధోనీ అనూహ్యంగా టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇటీవల టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవడం, ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన టెస్టు క్రికెట్ కేరీర్ నుంచి తప్పుకోవాలని ముందుగానే నిర్ణయించుకుని ఇవాళ అస్ట్రేలియాతో మ్యాచ్ డ్రాగా ముగిసిన తరువాత ధోణి తన నిర్ణయం ప్రకటించాడు.
2004లో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించిన ధోనీ ఆ మరుసటి ఏడాది 2005లో ధోనీ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ తన కెరీర్లో 90 టెస్టులు ఆడాడు. 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ధోనీ అత్యుత్తమ స్కోరు 224. ఆస్ట్రేలియాతో ఈ రోజు ముగిసిన మూడో టెస్టే ధోనీకి ఆఖరి మ్యాచ్. ధోనీ సారథ్యంలో భారత్ ఎన్నో ఘనవిజయాలు సాధించింది. టెస్టు క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 60 టెస్టుల్లో భారత్కు నాయకత్వం వహించిన మహీంద్ర సింగ్ దోణి 27 మ్యాచ్ల్లో జట్టుకు విజయాలందించాడు. కాగా విదేశీ గడ్డపై భారత్ పరాజయాలు చవిచూడటంతో విమర్శలు వచ్చాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more