అమెది ఛత్తీస్ గఢ్, అందులోనూ న్యాయవాది. తనకు జరిగిన అన్యాయంపై పిర్యాదు చేసింది. ఇదిగో అదిగో అంటూ ఏడాది గడిచింది. అయినా తనకు అన్యాయం చేసిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకోలేదు. ఇక తనకు మరణమే శరణమనుకుంది. కానీ తనకు జరిగిన అన్యాయంపై విషయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావాలనుకుంది. అంతే అనుకుందే తడవుగా.. ఢిల్లీకి చేరుకుని సుప్రీంకోర్టుకు చేరుకుంది. సర్వోన్నత న్యాయస్థానం సాక్షిగా సుప్రీంకోర్టు ఆవరణలో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
మహిళ ఆత్మహత్య యత్నం ఘటన సుప్రీంకోర్టులో కలకలం సృష్టించింది. ఆరా తీస్తే చత్తీస్గఢ్కు చెందిన న్యాయవాది... తనపై జరిగిన గ్యాంగ్ రేసు కేసులో న్యాయం జరగలేదంటూ విషం తాగి ఈ ఘటనకు పాల్పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు బాధితురాలిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. గత ఏడాది తనపై తమ బంధువర్గానికి చెందిన కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. సామూహిక అత్యాచారానికి గురైన మహిళా న్యాయవాది సుప్రీంకోర్టులో ఆత్మహత్యకు యత్నించిన ఘటనతో.. దేశంలో మహిళలకు వున్న భద్రత ఎంతన్న విషయం మరోమారు తేటతెల్లం అయ్యింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more