Governor narsimhan went to delhi tour

governor, narsimha, esl narsimhan, andhrapradesh governor, telangana governor, telugu states, delhi tour, telangana news, kcr, chandrababu naidu, assembly, rajnath singh, modi, narendra modi, prime minister, pranab mukarjee, indian president, rastrapati bhavan, latest news, hyderabad

governor narsimhan went to delhi on the part of two day tour : narsimhan will be in delhi from today for two days will discuss about two states issues with central government

హస్తినకెళ్ళిన నరసింహన్

Posted: 08/20/2014 11:01 AM IST
Governor narsimhan went to delhi tour

రెండు తెలుగు రాష్ర్టాల తొలి గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి వెళ్ళారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఈ ఉదయం హస్తినకు వెళ్ళారు. చాలా రోజుల తర్వాత రాజధానికి వెళ్తున్న నరసింహన్ ప్రభుత్వ పెద్దలను కలుస్తారని తెలుస్తోంది. పర్యటనలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడి, హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ సహా ఇతర ముఖ్య నేతలను గవర్నర్ కలుస్తారని సమాచారం. వీరితో రెండు రాష్ర్టాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, శాంతిభద్రతలు ఇతర అంశాలపై చర్చిస్తారు. రాష్ర్టంలోని తాజా పరిస్థితులపై కేంద్రానికి నెలకోసారి నివేదిక పంపటం గవర్నర్ బాధ్యత.

తాజా పర్యటనలో తెలంగాణ ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వే ప్రస్తావన తెస్తారని తెలుస్తోంది. సర్వేపై వివాదాలు, కోర్టు ఆదేశాలు, సర్వే వల్ల జరిగే పరిణామాలను కేంద్రానికి వివరించనున్నారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ, పాలనా పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను కేంద్రానికి తెలుపుతారు. అంతేకాకుండా హైదరాబాద్ లో శాంతిభద్రతలు, విభజన వల్ల జరుగుతున్న పరిణామాలను కూడా కేంద్రానికి తెలియజేస్తారు. అటు ఏపీలో ప్రస్తుత పరిస్థితులు, పాలనా నిర్వహణపై కేంద్రానికి నివేదిక ఇచ్చే అవకాశముంది. వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వంపై వివిధ పార్టీల నేతలు ఇటీవల తనకు సమర్పించిన ఫిర్యాదులు, నివేదికలను కూడా నరసింహన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు.  

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : governor  delhi tour  latest news  hyderabad  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more