ద్రాక్షపండులో గింజలు లేనివి వచ్చేసాయి. దానితో గింజలను ఉమ్మివేయవలసిన అవసరం లేకుండా పోయింది. తినేటప్పుడు నోటిలోంచి బయటకు తీయటమనే దాన్నిఅనాగరిక చర్య అనుకునేవారికి, దానివలన నలుగురిలో అటువంటి పదార్థాలను తినలేని వారికి అనుకూలంగా ద్రాక్షపండ్లు, దానిమ్మలు వచ్చేసాయి, జామపండ్లలో కూడా ఎక్కువ గింజలు లేనివి వచ్చాయి.
అయితే పండ్లలో అతి మధురమైనవి, అందరికీ నచ్చేవి అయిన మామిడి పండ్లు మాత్రం వాటిలోపల ఉండే టెంకె వలన నలుగురిలో తినటం కాస్త ఇబ్బందిగానే వుంటుంది. ముఖ్యంగా రసాలలాంటివి.
ఇక ఆ ఇబ్బంది లేకుండా టెంకె లేని మామిడి పండు రాబోతోంది బీహార్ లోని భగల్పూర్ జిల్లాలోని సబౌర్ లో ఉన్న బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనగా ఫలంగా. బీహార్ యూనివర్శిటీ లోని హార్టికల్చర్ విభాగం ఛైర్మన్ వి.బి.పటేల్ ఈ విషయంలో మాట్లాడుతూ, మామిడి పండ్లలోని రత్న, ఆల్ఫోన్సో రకాలలోంచి టెంకె లేని హైబ్రీడ్ ని ఉత్పత్తి చేసామని అన్నారు.
దేశంలో పలుప్రాంతాల్లో ప్రస్తుతానికి సింధు అని పేరు పెట్టిన ఈ వెరైటీ మామిడి ఉత్పత్తికి కృషి చేస్తున్నా బీహార్ లో ఉత్పత్తి చేసిన ఈ జాతిని హార్టికల్చర్ ఉత్పాదనగాను, కిచెన్ గార్డెన్ లో పెంచటానికి అనుకూలంగా ఉందంటున్న పటేల్ పరిశోధనా ఫలితంగా రూపుదిద్దుకున్న ఈ సింధు జాతి మామిడి చాలా ఆనందాన్ని కలిగిస్తోందంటన్నారు.
సగటున ఈ సింధు మామిడి పండు పై పొట్టుతో కలిపి 200 గ్రాములు తూగుతుందంట. దీని రంగు పసుపు పచ్చ. ఇందులో పీచు పదార్థం మామూలు మామిడి పండు కన్నా తక్కువుంటుందట. వచ్చే సీజన్లో బీహార్ లో రైతులకు ఈ మామిడిని సాగుచెయ్యటానికి అవకాశం కల్పిస్తామంటున్నారు బీహార్ వ్యవసాయ విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎమ్.ఎల్.చౌధరి. ఈ రకం మామిడిని విదేశాలకు ఎగుమతి చెయ్యటానికి ఎక్కువ అవకాశాలున్నాయని కూడా ఆయన తెలియజేసారు. పరిశోధన చక్కటి ఫలితాలిచ్చాయని, దీన్ని పొలాలలోని మామూలు వాతావరణంలో పండించటానికి కూడా అనుకూలమైనదేనని ఆయన అన్నారు.
బీహార్ లో పండ్ల సాగులో సగం మామిడి పంటకే రైతులు కేటాయించారు. దానివలన పోయిన సంవత్సరం బీహార్ లో 1.5 మిలియన్ టన్నుల మామిడి పండు పంట దిగింది.
ఇక ముందు టెంకె లేని పండు రావటం మొదలైన తర్వాత, మామిడి పండు తినటం ముఖ్యమా లేకపోతే టెంకెలు లెక్కపెట్టటమా అనే హిందీ సామెత అర్ధరహితమవవచ్చు. అయితే, మామిడి టెంకె చీకటంలో ఉన్న మజాయే వేరు కదా అనేవారూ ఉన్నారు. మజ్జిగన్నంలో ఆవకాయ పచ్చడిలోని టెంకె తో కూడిన ముక్క నంజుకునేటప్పడు కలిగే సంతృప్తికి మరి దేనితోనూ పోలిక లేదని కూడా అంటారు తెలుగువాళ్ళు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more