తమ బిడ్డల జోలికి వెళ్లితే.. ఎలాంటి వారైన ఆవేశంతో ఊగిపోతారు. తన పిల్లలను కాపాడుకోవటంలో పకృతిలో ప్రతి ప్రాణి పోరాటం చేస్తుంది. కొంతమంది అయితే.. తమ పిల్లలకు, కుటుంబ సభ్యులకు హానీ కలిగించన వారిపై పగ తీర్చుకుంటారు. కానీ ఒక తండ్రి మాత్రం తన కూతురిని చంపిన వారికి .. ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాయటం జరిగింది. ఇది నిజంగా చరిత్రలో నిలిచిపోయే సంఘటనే. ఇది జరిగింది ఎక్కడో కాదు.. ఇటీవల మలేషియా విమానం ఉక్రెయిన్ లో కొంతమంది పేల్చిన విషయం తెలిసిందే. దీంతో ఘటనలో 300 మంది ప్రాణాలు.. ఆకాశంలో కలిసిపోయాయి. ఇప్పటికి వారి మృతదేహాలు కనిపించక.. ఆ 300 మంది కుటుంబాలు.. శోకసంద్రంలో అల్లాడిపోయింది.
ఈ దుర్ఘటనలో తన ఒక్కగానొక్క కూతురిని కోల్పోయి పుట్టు దుఃఖంలో మునిపోయిన ఓ నెదర్లాండ్ దేశస్థుడు నేరుగా రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ కు బహిరంగ లేఖ రాశాడు. 'నా కూతురిని చంపిన వారికి ధన్యవాదాలు' అంటూ లేఖలో పేర్కొని ఎవరూ చేయని విధంగా నిరసన వ్యక్తం చేశాడు. తన హృదయ వేదనను లేఖ రూపంలో అక్షరీకరించాడు.
'నా ఒక్కగానొక్క కూతురు వచ్చే ఏడాదితో పాఠశాల విద్య పూర్తి చేసుకోబోతున్న తన కూతురు డెలఫ్ట్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదవాలని ఆశ పడిందని తెలిపాడు. ఒక యువతి జీవితాన్ని అర్థాంతరంగా అంతం చేసినందుకు అద్దంలో చూసుకుని మీరు గర్వపడతారనని తాను అనుకుంటున్నానని పుతిన్ కు రాసిన లేఖలో హాన్స్ డీ బోర్ట్స్ రాశారు.
'నా ఒక్కగానొక్క కూతుర్ని చంపినందుకు పుతిన్ కు, రష్యా తిరుగుబాటుదారులకు లేదా ఉక్రెయిన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు' అంటూ నెదర్లాండ్ కు చెందిన హాన్స్ డీ బోర్ట్స్ రాసిన బహిరంగ లేఖను డచ్ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. 17 ఏళ్ల ఆయన కుమార్తె ఎల్స్ మీక్- విమాన ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయింది. ఆకాశయానం చేస్తూ విదేశీ యుద్ధ రంగంలో తగిలిన దెబ్బతో తన కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిపోయిందని హాన్స్ డీ బోర్ట్స్ వాపోయాడు.అయితే తన లేఖను ఇంగ్లీషులోని అనువదించుకుని వెంటనే చదువుతారని ఆకాంక్షించాడు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more