ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక్కసారి ఫిక్స్ అయితే.. ఆయన ఎవరి మాట వినరు. రాకెట్ లో ముందుకు దూసుకుపోవాల్సిందే ఆయన సన్నిహితులు అంటున్నారు. అయితే అది నిజమేఈరోజు బయటపడింది. ‘‘ రాళ్లు విసిరిన చేతులే.. ఈరోజు స్వాగతం పలుగుతున్నాయి’. గతంలో మోడీ అంటే నచ్చని అమెరికాకు.. ఇప్పుడు మోడీ కావాల్సి వచ్చింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అమెరికా వెయ్యి కళ్లతో ఎదరుచూస్తుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వెళ్లనున్నారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మోడీని అమెరికా పర్యటనకు రావాలని ఆహ్వానించారు. సెప్టెంబర్ లో వీరిద్దరు భేటీ కానున్నారు. రెండు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు మెరుగు పరిచేందుకు వీరిద్దరు సమావేశం కానున్నారు. అమెరికా విదేశాంగ సహాయ మంత్రి విలియం బర్న్స్ ఈ రోజు మోడీని కలిసి..ఆహ్వాన పత్రికను అందించారు. అమెరికా పర్యటను మోడీ ఆమోదం తెలిపారు. అమెరికా ఆహ్వానానికి మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు మోడీ తెలిపారు.
గతంతో దేశ ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం జరిగిన రోజు ఒబామా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని మోడీతో బర్న్స్ అన్నారు. అమెరికా విదేశాంగ సహాయ మంత్రి విలియం బర్న్స్ విదేశాంగ సహాయ మంత్రి సుష్మా స్వరాజ్, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీతోనూ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి వీరిద్దరితోనూ అమెరికా విదేశాంగ మంత్రితో చర్చించినట్లు సమాచారం.
మొత్తానికి సెప్టెంబర్ లో మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. 2002 గుజరాత్ అల్లర్ల మూలంగా ఆయన అమెరికా వీసాను రద్దు చేశారు. చాలా సార్లు అమెరికా వచ్చేందుకు అనుమతి కూడా ఇవ్వలేదు. దీంతో చాలా కాలం తర్వాత మోడీ అమెరికా టూర్ కు వెళ్లనున్నరు.
RS
(And get your daily news straight to your inbox)
Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more
Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more
Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more
Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more
Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more