తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు అయిన నన్ననేని రాజకుమారి పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ పగ తోనే దాడి చేశాడని తెలుదేశంపార్టీ నాయకులు అంటున్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్తీకరణ బిల్లు ప్రవేశపెట్టిన వెంటనే తెలుగుదేశం పార్టీ సీమాంద్ర నాయకులు రెచ్చిపోయి, పోడియం చుట్టుముట్టారు. సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్సీలు ఆ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలి మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు బిల్లు తప్పులు తడకలుగా ఉందని, ఇలాంటి బిల్లును కనీసం చూసుకోకుండా ఎలా ప్రవేశపెడతారని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మండిపడుతూ మీడియా పాయింట్లో మాట్లాడుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు అక్కడి చేరుకున్నారు. ఆ సమయంలో నన్నపనేని రాజకుమారి మీడియాతో మాట్లాడటం చూసి స్వామి గౌడ్ రెచ్చిపోయాడు. అంతే ఆమెను మీడియాతో మాట్లాడనివ్వకుండా వారిని అడ్డుకుంటూ తెలంగాణ నినాదాలు చేయసాగారు. ఇంతలో సీమాంద్ర నేతలకు అక్కడి చేరుకోవటంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇరు ప్రాంతాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సతీష్ రెడ్డి, నన్నపనేనిలపై చేయి చేసుకుని వారిని తోసేశారు. దీంతో నన్నపనేని రాజకుమారి కింద పడిపోయారు.
ఇద్దరు ఎమ్మెల్సీలు ఆమెను చేతులు పట్టుకుని పైకి లేవదీయాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఎదురుగా ఉన్న టేబుల్ మీదకు నన్నపనేని ఎక్కి, ఆవేశంగా మాట్లాడుతూ, నినాదాలు చేస్తుండగా, స్వామిగౌడ్ కూడా ఆమెకు పోటీగా టేబుల్ మీదకు ఎక్కి మాట్లాడటం, నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయితే స్వామి గౌడ్ తీరు చూస్తే నన్నపనేని మీద పగ తీర్చుకోవటానికి ఇలా చేసి ఉంటాడని రాజకీయ నాయకులు అంటున్నారు.
గతంలో స్వామిగౌడ్ పై నన్నపనేని కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో స్వామిగౌడ్ బాక్స్ బద్దలవ్వటం కూడా జరిగింది. ఆ విషయలను మనసులో పెట్టుకొని స్వామి గౌడ్ ఇలా చేసి ఉంటాడని సీమాంద్ర నేతలు అంటున్నారు. వెంటనే స్వామి గౌడ్ పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్వామి గౌడ్ అలా రెచ్చిపోవటానికి కారణం కేసిఆరే అని సీమాంద్ర ఉద్యోగులు అంటున్నారు. కేసిఆర్ చేస్తున్న విచిత్రమైన విమర్శల వల్ల టీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోయి , ఇలాంటి ఘాతుకాలకు తెగబడుతున్నారని సీమాంద్ర నేతలు అంటున్నారు. ఈ సంఘటపై ..ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more