సీమాంద్ర ఉద్యమం కారణంగా మెగా సినిమాలకు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. పవర్స్టార్ పవన్కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొంది విడుదలకు సిద్ధమైన 'అత్తారింటికి దారేది' చిత్రం సెప్టెంబర్ నెలాఖరుల ప్రేక్షకుల ముందుకురావడానికి సిద్ధంగా ఉందని ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం. రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో నెలకొన్న ఉద్యమం కారణంగా భారీ చిత్రాల విడుదలవాయిదా పడిన సంగతి తెలిసిందే. రామ్చరణ్ నటించిన 'ఎవడు' సినిమాసైతం ఇదే ఈ కారణంగానే నిలిచిపోయింది. భారీసినిమాలు రాకపోవడంతో థియేటర్లు వెలవెలబోయాయి. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న చిన్న చిత్రాల నిర్మాతలు హడావుడిగా తమ సినిమాలు రిలీజ్ చేశారు. వారానికి ఐదు నుండి ఏడు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకువచ్చాయి. అయితే చిన్న సినిమాలకు లభించిన ప్రేక్షకాదరణ అంతంతమాత్రంగానే ఉందని సినీవ్యాపార వర్గాలు అంటున్నాయి. సిమాంధ్రలో కేవలం సాయంత్రం ప్రదర్శించే రెండు ఆటలకు మాత్రమే ప్రేక్షకులు వస్తున్నారట. మార్నింగ్, మ్యాట్నీ షోలకు ప్రేక్షకులు కరువయ్యారు. కేవలం థియేటర్లు లభ్యం అవుతున్నాయనే కారణంగానే చిన్న సినిమాలను విడుదల చేయగలిగారు. అయితే థియేటర్ల ఫీడింగ్ ఉండాలంటే భారీ చిత్రాలు రావల్సిందే. లేదంటే ఇబ్బందులు తప్పవని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు నెలరోజులుగా భారీ చిత్రాల విడుదల ఆగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ మొదటివారంలో విడుదలవుతున్న 'తుఫాన్' చిత్రంపై నిలిచింది. రామ్చరణ్ నటించగా, రిలయన్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందనే విషయంపై పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. 'తుఫాన్' చిత్రానికి ఇబ్బంది తలెత్తని పక్షంలో ఆ వెంటనే అత్తారింటికి దారేది చిత్రాన్ని విడుదల చేయడానికి ఈ చిత్రాన్ని భాగస్వామిగా నిర్మించిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సిద్ధంగా ఉంది. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించే చిత్రాలు విడుదలకాకుండా నిలిచిపోతే నష్టం కూడా కోట్లల్లో ఉంటుందని తెలిసింది. ఉద్యమానికి సినిమాలకు మధ్య లింకు పెట్టడం సరికాదని అంటూనే ప్రజలు ఆందోళ చేస్తున్నపుడు వినోదాన్ని అందించే సినిమాలను విడుదల చేయడం సబబా? అని ప్రశ్నిస్తున్న వారున్నారు. లక్షలాది అభిమానులు పవన్కల్యాణ్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారనేది వాస్తవం. ఇదంతా 'తుఫాన్' సినిమాపై ఆధారపడిఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more