గులాబీ బాస్ మరో గండం ఉందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కేసీఆర్ను కొన్ని శక్తులు హత్య చేయాలని కుట్ర పన్నుతున్నాయని, టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేంద్ర, ఉపనేత హరీష్రావు హెచ్చరించారు. కేసీఆర్ను హత్య చేయడానికి కొన్ని దుష్టక్తులు యత్నిస్తున్నట్టు సమాచారముందని హరీష్రావు తెలిపారు. మూడు రోజుల క్రితం ఇంటిలిజెన్స్ ఐజీని కలిసి వివరాలు అందజేసినట్లు వారు పేర్కొన్నారు. కుట్ర ఫోన్కాల్స్ పరంపర కొనసాగుతుందని మండిపడ్డారు. ఇందుకు సుపారీ కూడా ఇచ్చారని ఆరోపించారు. ఎవరు సుపారీ ఆఫర్ చేశారు... ఎవరు తీసుకోవడానికి వచ్చారో తమ దగ్గర పూర్తి సమాచారముందని, సమయం వచ్చినప్పుడు తాము దానిని బయటపెడతామన్నారు. కెసిఆర్ హత్యకు కుట్రపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడికి ఏమైనా జరిగితే తెలంగాణ అల్లకల్లోలం అవుతుందన్నారు. హత్యకు కుట్ర పన్ని వారి సమాచారం ఉందని, అవసరమైతే సమాచారం ఇస్తామన్నారు. కెసిఆర్కు జడ్ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మూడు రోజుల క్రితం ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. పార్టీ తరఫున ప్రభుత్వానికి రిట్ పిటిషన్ ఇస్తామన్నారు. కెసిఆర్ విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు.
కెసిఆర్ను పోలీసులు కంటికి రెప్పలా కాపాడాలని కోరుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. లేదంటే తామే తమ ఉద్యమ నేతను రక్షించుకుంటామన్నారు. అయిన కేసిఆర్ కు ఎవరు శత్రువు ఉంటారు. కేసిఆర్ ను హత్య చెయ్యటానికి ఎవరు సుఫారీ (కోట్లు) తీసుకున్నారు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి , కేసిఆర్ ను హత్య చేస్తే వారికి వచ్చే లాభం ఏమిటి? కేసిఆర్ హత్యకు ఎవరు సుఫారీ ఇచ్చారు. అనే విషయాలు మాత్రం ఎవ్వరికి తెలియాదు. కానీ సిద్దిపేట ఎమ్మెల్యే హరిష్ రావు, ఈటెల రాజేంద్ర కు తెలుసునని చెబుతున్నారు. అయితే ఆ తెలిసిన నిజాలను పోలీసు అధికారులకు ఇస్తే కేసిఆర్ కు పూర్తి రక్షణ కల్పిస్తారు కదా. కేసిఆర్ హత్యకు సుఫారీ తీసుకున్నారని మీడియా ముందు గోల చెయ్యటం ఎందుకు? కేసిఆర్ ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో అది ఆలోచించాలి? ఒక ముఖ్య రాజకీయనేత, ప్రముఖ ఉద్యమనేత అయిన కేసిఆర్ పై హత్యకు కుట్ర ప్లాన్ చేసిన దోషులను ప్రజల ముందు తీసుకురావాలి.
అలాంటి దోషులను తెలుగు జాతి ప్రజలకు చూపించాలి. ఈ రోజు కేసిఆర్ ,రేపు మరో నేత, ఇలా మన రాజకీయ నేతలను హత్య చేస్తుంటే.. తెలుగు జాతి బిడ్డలు చూస్తూ ఊరుకోరాని వారికి చెప్పాలి. మన దగ్గర ఉన్న నిజాలను బయట పెట్టకుండా.. ఒక ప్రాంతవారి పై నిందాలు వెయ్యటం మంచిది కాదు. ముందు ఆ దోషులను ప్రజలకు పరిచయం చేస్తే.. కేసిఆర్ అభిమానులే వారిని ఏం చెయ్యలో అది చేస్తారు? మన ఇంట్లో వారి హస్తం లేకుండా, బయట వారు, కొత్త వారు ఎవరు ఈ సాహసం చెయ్యరు. ముందు మనలో దాగి ఉన్న దొంగ ను బయటకు లాగితే.. అసలు డొంక కదులుతుంది. మన అది మరిచి మీడియా ముందు గోల చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యటం మంచిది కాదని.. రాజకీయ మేథావులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more