కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ దిశగా నిర్ణయం తీసుకుంటుందనే వార్తల దరిమిలా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు నేడు నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సీమాంద్ర మంత్రుల సమావేశం నిర్వహించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందే తన గళాన్ని వినిపిస్తామని చెప్పిన మంత్రి శైలజానాథ్ అన్నంత పని చేశారు. నేడు నిర్వహించిన ఈ మంత్రుల సమావేశం గత కొద్ది సేపటి క్రితమే ముగింసింది. ఈ సమావేశానికి పంతొమ్మిది మంది మంత్రులు హాజరై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉంటే తమ పదవులతో పాటు పార్టీకి కూడా రాజీనామా చేయాలని వారు ఈ సమావేశ సందర్భంగా నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వారు... తెలంగాణ విషయంలో జరగరానిది జరిగితే తాము పార్టీని, పదవులు వదులుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు అందరూ సమైక్యాన్ని సమర్థిస్తూ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని కోరుకుంటున్నారన్నారు .
తమకు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడం మినహా మరో మార్గం లేదని చెప్పారు. రాజీనామాలు చేస్తే అధిష్టానం మాటకు కట్టుబడి ఉండని వాళ్ళం అవుతామని, రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందా ?ఉండదా అన్నదానిపై తర్జనభర్జనలుపడుతున్నారు . రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే తమ వాదనను సీఎం కిరణ్ కు, పీసీసీ చీఫ్ బొత్సలకు వివరించాలని కూడా వారు నిర్ణయించుకున్నారు. 26వ తేదీన ఢిల్లీలో అధిష్ఠానాన్ని కలవాలని కూడా వారు నిర్ణయించుకున్నారు. ఏది ఏమైనా తెలంగాణ అంశంపై సమైక్యవాదంతో ఉన్న మంత్రులకు సంబందించి ఇది చివరి సమావేశం అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మరి అధినేత్రి వీరి బెదిరింపులకు భయపడి తెలంగాణ నిర్ణయాన్ని మళ్లీ పెండింగులో పెడుతుందా ? లేక తేల్చేస్తుందా సీడబ్ల్యూసీ సమావేశం వరకు వేచి చూడాల్సిందే..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more