సినిమాలకు హీరోలు యాక్షన్ను పండిస్తే...కథానాయికలు గ్లామర్ను పండిస్తారు. ఈ రెండు ఏ సినిమాకైనా ఉండితీరాల్సిందే. లేదంటే థియేటర్లో టిక్కెట్ తెగడం కష్టమవుతుంది. ఈ ఒక్క రీజన్ అలుసుగా చేసుకుని లక్షలు, కోట్లు గడించాలని నాయికలు చూడడం సహజం. కానీ అవి కొంత మంది నాయికలకే సొంతమవుతాయి. ఈ జాబితాలో త్రిష మాత్రం ముందుంది. అనుకున్నన్ని సినిమాలు అమ్మడు చేతిలో లేకపోయినా డిమాండ్ మాత్రం బాగానే ఉంది.
ప్రస్తుతం దక్షిణాదిన అత్యధిక పారితోషకం తీసుకుంటున్న భామల్లో ఫస్ట్ ప్లేస్ ఈమదే అంటున్నారు సినీ ప్రియులు. ఈ భామ గ్లామర్ ప్రపంచానికి వచ్చి దశాబ్దం పూర్తయింది. ఈ మధ్యలో చాలా మంది హీరోయిన్లు వచ్చారుగాని కెరీర్ నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలే త్రిషపై కన్నెసిన ఓ మ్యూజిక్ ఛానల్ నిర్వహించిన సర్వేలో ఈమె పారితోషకం బండారం బయటపడింది. ఈ ఛానల్ మీకిష్టమైనా హీరోయిన్ ఎవరని అడిగిన ప్రశ్నకు చటుక్కున తమిళతంబీలు త్రిషవైపై మొగ్గు చూపారట. ప్రస్తుతం తెలుగు,తమిళ్లో రెండు సినిమాలు చేస్తుంది.
'రమ్' సినిమా కోసం ఆమె కోటి రూపాయలు అడిగిందన్న వార్త ఫిల్మ్నగర్ వర్గాల్లో జోరందుకుంటున్న తరుణంలో మరో నిర్మాత త్రిష కాల్షిటు కోసం వెళ్తే కోటి అరవైలక్షలు అడిగిందని ఫిల్మ్నగర్ వర్గాల సమాచారం. దక్షిణాది కథానాయికల్లో ఇప్పటి వరకూ కొటి రూపాయల పారితోషకం తీసుకున్నది ఎవ్వరూ లేరు. ఆమధ్య శంకర్ డబ్బింగ్ సినిమా 'స్నేహితుడు' కోసం ఇలియానా కోటిన్నర మాత్రం తీసుకుంది. ఇప్పటి వరకు సౌత్ హీరోయిన్లలో ఇలియాననే టాప్ అనుకున్నారు అందరు. ఆమె రికార్డును త్రిష తిరగారాస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
దర్శకుడు, నటుడు రవిబాబు ఇద్దరు వేశ్యలను టార్చర్ పెట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. కొంపతీసి ఇది రియల్ లైఫ్లో అనుకునేరు. ఇదంతా రీల్ లైఫ్లో మాత్రమే. కామెడీ విలన్ పాత్రలకు బాగా పాపులర్ అయిన రవిబాబు త్వరలో విడుదల కాబోతున్న పవిత్ర, ప్రేమ ఒక మైకం చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించబోతున్నాడు. పవిత్ర చిత్రంలో హీరోయిన్ శ్రీయ వేశ్య పాత్రలో నటిస్తుండగా, ప్రేమ ఒక మైకం చిత్రంలో హీరోయిన్ చార్మి వేశ్యగా దర్శనం ఇవ్వనుంది. ఈ రెండు చిత్రాల్లో విలన్ రోల్ చేస్తూ....ఆ ఇద్దరు వేశ్యలను తెగ టార్చర్ పెట్టబోతున్నాడు రవిబాబు. భారీ పర్సనాలిటీతో భయంకరమైన విలనిజం పండించడంతో పాటు, ఫన్సీ చేష్టలతో కామెడీ చేయడం రవిబాబు ప్రత్యేకత.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more