గత రెండు నెలలుగా ఆమె సచివాలయానికి దూరంగా ఉంటున్నానని, ఇంకా గనుల శాఖ ముఖ్యకార్యదర్శి దాసరి శ్రీనివాసులును ఆ స్థానంలో కొనసాగిస్తే తనను వెంటనే మంత్రి పదవి నుండి తప్పించాలని ఆమె అధిష్ఠానం పెద్దల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. దాదాపు గత రెండు నెలల కాలంలో ఆమె ఒకే ఒక్కసారి ఈ నెల 14న సెక్రటేరియట్కు వచ్చారు. దాసరి శ్రీనివాసులు బదిలీలకు సబంధించిన ఫైళ్లను ఆమె ముందు ఉంచారు. అయితే ఆమె ముభావంగా ఉండిపోయినట్లు సమాచారం.
దీంతో చాలా ఫైల్స్ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. కనీసం 1500 ఫైల్స్ మంత్రి పేషీకి రాకుండానే దాసరి శ్రీనివాసులు నేరుగా క్లియర్ చేశారని సమాచారం. కొన్ని ఫైల్స్ మంత్రి ఆమోదం పొందవలసి ఉన్నా ఆయనే నేరుగా వాటిని క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్ర మంత్రికి, ఆ శాఖకు సంబంధించిన ముఖ్యకార్యదర్శికి మధ్య తీవ్ర అగాధం నెలకొంది. ఈ విచిత్ర పరిస్థితుల వల్ల ఆ శాఖలో పరిపాలన పూర్తిస్థాయిలో స్తంభించిపోయింది. గత రెండు నెలలుగా ఈ విభాగంలో ఎలాంటి ఫైల్స్ కదలడం లేదంటే ఆశ్చర్యం లేదు. ఆ మంత్రి మరెవరో కాదు. రాష్ట్ర గనుల శాఖ నిర్వహిస్తున్న గల్లా అరుణ.
ఆ ముఖ్యకార్యదర్శి ఇటీవలే వార్తల్లో వ్యక్తి అయిన దాసరి శ్రీనివాసులు. వీరిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి చివరకు ఢిల్లి నాయకత్వానికి పరిస్థితి వివరించాల్సిన అవసరం ఏర్పడిందంటే వీరి విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దాసరి శ్రీనివాసులను అదే శాఖలో ముఖ్యకార్యదర్శిగా కొనసాగిస్తే తాను రాష్ట్ర సచివాలయం ముఖం కూడా చూడనని మంత్రి గల్లా అరుణ అలకబూనారంటే ఆమె ఎంత క్షోభకు గురయ్యారో తెలుస్తూనే ఉంది. వీరిద్దరి మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం వల్ల ఆ శాఖలో ఫైల్స్ ఏమాత్రం ముందుకు జరగడం లేదని అధికార వర్గాలే అంగీకరి స్తున్నాయి.
ముఖ్యకార్యదర్శి దాసరి శ్రీనివాసులు ఆ శాఖను చేపట్టిన నాటినుండి వివాదాల్లో చిక్కుకునే ఉన్నారు. మొదటినుండి ఆయనకు మంత్రి గల్లాతో అంతగా పొసగడం లేదని అప్పటినుండే సచివాలయ వర్గాలు చెవులు కొరుక్కునేయి. అయితే తర్వాత ఏదోవిధంగా ఇద్దరు సర్దుకుపోయారనే వార్తలు కూడా వినవచ్చినా ఇటీవల వారి విభేదాలు పూర్తిగా బహిర్గతమయ్యాయి.
మంత్రి గల్లా అరుణ మొదట్లో తన శాఖ ముఖ్యకార్యదర్శి తన మాటను ఏమాత్రం ఖాతరు చేయడం లేదని ముఖ్యమంత్రి దగ్గర గతంలో రెండు, మూడుసార్లు వాపోయారని సమాచారం. అయితే, ఈ విషయంలో ఏమాత్రం సర్దుబాటు చర్యలు లేకపోవడంతో ఆమె నేరుగా ఇటీవల ఢిల్లికి వెళ్ళి అధిష్ఠానం వద్ద తన గోడు వెళ్ళబోసుకున్నట్లు సమాచారం
. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దల వద్ద దాసరి గురించి పూర్తిస్థాయిలో ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ వద్ద ఆమె పరిస్థితిని పూర్తిగా వివరించారని సమాచారం. ఒకవేళ దాసరి శ్రీనివాసులను అదే స్థాయిలో కొనసాగిస్తే తనను మంత్రి పదవి నుంచి తప్పించాలని, దాసరి ఆ పదవిలో కొనసాగితే తాను ఒక్క క్షణం కూడా మంత్రిగా ఉండనని కూడా ఆమె వారివద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దాసరి శ్రీనివాసులు ఇటీవలే వార్తల్లోకెక్కారు. ఆయనే ముఖ్యకార్యదర్శిగా ఉన్న మరో శాఖలో కూడా సంబంధిత మంత్రి పూర్తి అసంతృప్తిగానే ఉన్నారు. ఒక స్థాయిలో స్వయంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సర్ది చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. చేనేత, జౌళిశాఖలో కూడా ఆ శాఖమంత్రి ప్రసాద్కుమార్ దృష్టికి వెళ్ళకుండా దాదాపు తొమ్మిది జీవోలను శ్రీనివాసులు విడుదల చేశారు. అప్పట్లో అదిపెద్ద సంచనలమే సృష్టించింది. చివరకు అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ జోక్యం చేసుకుని శ్రీనివాసులును స్వయంగా పిలిపించి ఈ విషయంపై ఎంక్వయిరీ కూడా చేసినట్లు సమాచారం.
తాజాగా గల్లా అరుణకుమారి ఈ ముఖ్యకార్యదర్శి అదే స్థానంలో కొనసాగితే తాను సెక్రెటరియట్ ముఖం కూడా చూడనని భీష్మించుకు కూర్చున్నారు. కళంకిత మంత్రుల విషయంలో ఇప్పటికే తలబద్దలు కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి ఎవరిని బుజ్జగిస్తారో, ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించి పరిపాలనను సాఫీగా కొనసాగేటట్లు చూస్తారో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more