ఈ రోజు మా నాయకుడు వస్తాడని, ఎదురుచూసిన .. వైఎస్ అభిమానులకు, నిరాశే మిగిలింది. ఒకే రోజు ముగ్గురిని నిరాశపరిచిన సుప్రీం కోర్టు. ‘వారు వస్తారని ’.. అభిమానులు, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు ఎదురుచూశారు. కానీ చివరకు నిరాశ మిగిలింది. జస్టిస్ సదాశివం, జస్టిస్ ఇక్బాల్ లతో కూడిన ధర్మసనం ఈ తీర్పును వెలువరించింది. ఆర్థిక నేరాల వల్ల ప్రజాసంపదా దుర్వినియోగమవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకే కేసులో నిందితులుగా ఉన్న ఈ ముగ్గురికి నిరాశ మిగిలింది. ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని కోర్టు ఆదేశించింది. సెప్టెంబర్లోపు దర్యాప్తు పూర్తి చేసి తుది ఛార్జ్షీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది. సెప్టెంబర్ లోపు దర్యాప్తు పూర్తి కాకుంటే బెయిల్ కోసం పిటిషనర్ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో ఓ మాట, హైకోర్టులో ఓ మాట చెప్తూ సీబీఐ కేసును తప్పుదోవ పట్టిస్తోందని జగన్ తరపు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. సీబీఐ మాత్రం కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని, ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని వాదించింది.
విజయసాయి రెడ్డి. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సాయిరెడ్డి బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 5లోగా లొంగిపోవాలని సుప్రింకోర్టు విజయసాయి రెడ్డిని ఆదేశించింది. అయితే విజయసాయి రెడ్డికి కొంత ఊరట లభించింది. ఈనెల 26 తన కూతురి పెళ్లి దగ్గరుండి చేసేందుకు వీలుకలిగినందుకు కొంచెం ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిమ్మగడ్డ ప్రసాద్ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన నిమ్మగడ్డప్రసాద్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. నిమ్మగడ్డ ప్రసాద్ కుటుంబ సభ్యులకు మళ్లీ నిరాశ మిగిలింది.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై , పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు , పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఆశపెట్టుకున్నారు. ఈరోజు జగన్ కు బెయిల్ వస్తుందనే ఆశ వారికి నిరాశే మిగిల్చింది. మళ్లీ జగన్ బెయిల్ కోసం సెప్టెంబర్ వరకు అగాల్సిందే. అప్పటి వరకు జగన్ అభిమానులు ఎదురు చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more