రాజకీయాం అవినీతిమయం అయిందని అందరికి తెలుసు. అవినీతి నిర్ములనపై అనేక ఉద్యమాలు, పోరాటలు, దీక్షలు, దర్నాలు చేస్తున్ననాయకులు, మహామేధావులు ఉన్నారు. వారు ఏం చేసిన అవినితీని అంతం చేయలేక పోతున్నారు. కొందరు యువత రాజకీయాల్లోకి రావాలి? మరికొందరు వ్యవస్థ మారాలి? అని చెబుతారు తప్ప.. మనం మారాలి, ప్రజలు మారాలి అని ఏ ఒక్కరు చెప్పారు. ఎందుకంటే సమస్యను ఎదుటివారి మీద వేయటం మనకున్న మొదటి లక్షణం. చివరకు అవినీతి పై ఒక బడా వ్యాపారి విమర్శలు చేయటం విశేషం. ఆయన దేశంలో అత్యున్నతమైన బిజినెస్ మెన్. దేశంలోనే టాప్ టేన్ స్థానంలో ఒకరు ఆయన. ఆయన నిరంతరం సామాన్యుడికి అందుబాటులో ఉంటే విధంగా వ్యాపారం చేస్తున్న వ్యక్తి. అతనే టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా. ఈ నెల 28న ఆయన పదవీ విరమణ చేయనున్న పారిశ్రామిక దిగ్గజం. అలాంటి దిగ్గజం ప్రభుత్వం మండిపడుతున్నాడు. ప్రభుత్వ తీరుపైనా, దేశీయా వ్యాపార పరిస్థితులపైనా రతన్ టాటా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి సంచనలం పుట్టించారు. భారతదేశంలోని వ్యాపార వాతావరణమంతా అవినీతితో నిండిపోయిందని రతన్ టాటా మండిపడుతున్నారు. అసలు నైతిక ప్రమానాలు పాటించడం వల్లే వ్యాపారంలో మరింత ముందుకు వెళ్లలేకపోయమాని ఆయన అంటున్నారు. టాటా గ్రూప్ నైతిక ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా ఉండాలంటే తన వారసుడు సైరస్ మిస్త్రీ చాలా కష్టపడాల్సి వస్తుందని రతన్ టాటా చెబుతున్నారు. ఈ లంచగొండి వ్యవస్థకు లొంగిపోవాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకునే ముందు అనేకసార్లు రాజీపడ్డామా, తలొగ్గామా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. మన ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడం వల్లే దేశీయ పారిశ్రామిక రంగం చైనాతో పోటీపడలేకపోతుందని రతన్ టాటా ఆవేశంగా చెప్పారు. ఇప్పటికి పెద్ద ప్రాజెక్టులకు అనుమతులు దక్కించుకోవాలంటే కనీసం పదేళ్లు పట్టేస్తుంది. దీని వలన ఇన్వెస్టర్లు ఇండియాకు రావాలంటే జంకుతున్నారని టాటా అన్నారు. ఏన్నో ఫిర్యాదులు వస్తున్నప్పటికి వాటిని పరిష్కరించడంలో ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ విఫలమవుతున్నారని రతన్ టాటా అన్నారు. దీనివలన మాలాంటి బడా బిజినెస్ వ్యాపార సంస్థలు విస్తరణ కోసం పొరుగు దేశాల వైపు పరుగులు తీయాల్సిన పని వస్తుందని రతన్ టాటా అన్నారు. రతన్ టాటా ప్రభుత్వం విమర్శలు చేయటం ఇదే మొదటి సారి అని వ్యాపారవేత్తలు అంటున్నారు. రతన్ టాటా చేసిన విమర్శలపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more