తెలంగాణ పై స్పష్టమైన వైఖరి మన రాష్ట్రంలో తెలపని పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అవి తెలుగు దేశం ఒకటి... మరొకటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు తమ వైఖరిని ఇంత వరకు స్పష్టంగా చెప్పలేదు సరికదా ? బిల్లు పెడితే మద్దతిస్తామని సాగదీస్తున్నాయి. ఇలా సాగదీయడంతో ఆ పార్టీలకు నష్టం జరిగిందనే చెప్పవచ్చు. తెదేపా విషయం ప్రక్కన బెడితే... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ జైలుకు వెళ్ళడంతో ఆ పార్టీలో ఆ విషయం మరుగున పడిపోయింది. అయితే జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం పై అటో ఇటో తేల్చడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఆయన జైలు నుండే వ్యూహాలు రచిస్తున్నారు.
తెలంగాణ జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాలలో సర్వేలు చేసి, వాటి ఆధారంగా ఎవరికి పట్టు ఉంటే వారిని తమ వైపుకు లాక్కునే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారట. ఇటీవలి కాలంలో తెలంగాణకు చెందిన పలువురు నేతలు జగన్ను జైలులో కలుస్తున్నారు. సోమవారం నల్గొండ జిల్లా సీనియర్ టిడిపి నేత సంకినేని వెంకటేశ్వర రావు జైలులో జగన్ను కలిశారు. ఈయనతో జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ అంశం విషయం ప్రస్తావనకు తెచ్చినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్న తెలంగాణ నాయకులకు కూడా ఈ విషయం చెప్పండి అని అన్నట్లు విశ్వసనీయ సమాచారం. అంటే జగన్ వ్యూహాన్ని బట్టి చూస్తుంటే.. తెలంగాణ నాయకుల్ని ఆకర్షించి, తెలంగాణ జిల్లాలలో కూడా తన పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఒకవేళ జగన్ తెలంగాణకి జై కొడితే... గతంలో చేసిన సమైక్యాంద్ర నినాదం గాలికి వదిలేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more