High Court Allows ACB To Question Dhulipalla Narendra ధూళిపాళ్ల అనారోగ్యంపై తనయ అందోళన.. కోవిడ్ పరీక్షలు

Sangam dairy ap high court allows acb to question dhulipalla narendra

Andhra Pradesh High court, Andi corruption Bureau, Sangam Dairy Board Chairman, Dhulipalla Narendra kumar, Vaideepthi, Rajamundry Jail, Sangam Dairy MD, former district co-operative officer, AP High Court, ACB, Sangam Dairy, Dhulipalla Narendra, Gopala Krishnan, Gurunadham, Andhra Pradesh

The High Court allowed the Anti Corruption Bureau (ACB) officials to question former Sangam Dairy Board chairman and TDP leader Dhulipalla Narendra Kumar, MD P Gopalakrishnan and former District Cooperative Officer M Gurunadham in connection with the Sangam dairy irregularities in their custody.

ధూళిపాళ్ల అనారోగ్యంపై తనయ అందోళన.. కోవిడ్ పరీక్షలు..

Posted: 05/04/2021 07:56 PM IST
Sangam dairy ap high court allows acb to question dhulipalla narendra

సంగం డెయిరీ కార్యకలాపాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, ధూళిపాళ్ల అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలని ధూళిపాళ్ల కుమార్తె వైదీప్తి డిమాండ్ చేశారు.

తన తండ్రితో పాటు జైల్లో ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త కలవరపాటుకు గురిచేస్తోందని అన్నారు. ఇద్దరి ఆరోగ్య వివరాలను తెలపాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వైదీప్తి స్పష్టం చేశారు. కొవిడ్ పాజిటివ్ వ్యక్తులతో నిండిపోయిన జైలులో ఉంచడానికి వారేమీ నేరస్తులు కారని ఆమె వ్యాఖ్యానించారు. విచారణకు సంబంధించి ఇప్పటికే చాలా రోజులు గడచిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేద‌న్న విష‌యంపై ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ దీనిపై జైలు సూపరింటెండెంట్‌ రాజారావు స్పందిస్తూ పూర్తి వివ‌రాలు తెలిపారు.

గోపాలకృష్ణన్ కు కరోనా నిర్ధారణ అయింద‌ని, దీంతో ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివ‌రించారు. ఆయ‌న‌లో నిన్న మధ్యాహ్నం క‌రోనా లక్షణాలు క‌న‌ప‌డ్డాయ‌ని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు త‌లెత్తాయ‌ని అందుకే జైలు అధికారులు నిన్న రాత్రి క‌రోనా పరీక్షలు చేయించార‌ని ఆయ‌న చెప్పారు. దీంతో ఆయ‌న‌కు పాజిటివ్‌గా తేలింద‌ని వివరించారు. అలాగే, జైలులో ఉన్న సహకారశాఖ మాజీ అధికారి గురునాథం పాటు ధూళిపాళ్ల నరేంద్రకు ఈ రోజు క‌రోనా పరీక్షలు చేయిస్తామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles