తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను తీవ్ర అందోళనకు గురిచేస్తున్నాయి. గత ఏడాది సరిగ్గా మార్చి నుంచి పెరిగిన కేసులతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కూడా సరిగ్గా మర్చిలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతూపోతున్న కారణంగా ఈ సారి మళ్లీ రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తారా.? అన్న అనుమానాలు తలెత్తడంతో వ్యాపారులు, వాణిజ్య సంస్థలు తీవ్ర అందోలనకు గురవుతున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యాసంస్థలు అన్నింటికీ సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోమారు లాక్ డౌన్ విధిస్తారా అన్న అనుమానాలకు బలం చేకూరుతుంది.
ఇక సరిగ్గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రజలు లాక్ డౌన్ విషయంలో అసలు అందోళన చెందవద్దని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించే ఉద్దేశ్యమేమీ లేదని తేల్చిచెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రంలో థియేటర్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేయాలంటూ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. స్కూళ్ల నుంచి కరోనా విస్తరించే అవకాశం ఉన్నందున మూసివేసినట్లు చెప్పారు. విద్యాసంస్థల మూసివేత తాత్కాలికం మాత్రమే అని చెప్పారు. తెలంగాణలో కరోనా అంత తీవ్రంగా లేదని...ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు.
గతేడాది లాక్ డౌన్ విధించడంతో ఆర్థికంగా చాలా నష్టపోయామని తెలిపారు. కరోనాతో మొత్తం ప్రపంచం అతలాకుతలం అయ్యిందన్నారు. పరిశ్రమల మూతవేత ఉండదని స్పష్టం చేశారు. తక్కువ మంది అతిథుల మధ్యే శుభకార్యాలు జరుపుకోవాలని సీఎం సూచించారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాక్సిన్ డోసుల్లో మనవాటా మనకు వస్తుందని తెలిపారు. నిన్న ఒక్కరోజే 70వేల కరోనా టెస్ట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలు కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే అని స్పష్టం చేశారు. మాస్క్లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని ఆదేశించారు. స్వీయ క్రమశిక్షణతోనే కరోనాను నియంత్రించగలమని సీఎం కేసీఆర్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more