Brahmotsavam: Malayappa Swamy on Sarva Bhoopala Vahanam సర్వభూపాల వాహనంపై తిరుమల శ్రీవారు..

Tirumala brahmotsavam lord malayappa swamy taken in procession on sarva bhoopala vahanam

Tirumala Tirupati devastanam, Lord malayappa swamy as Rajadhi Raja, Sarva Bhoopala Vahanam, Rathostavam, Lord Malayappa swamy on SuryaPrabha Vahanam, Lord Malayappa swamy on Sarva Bhopala Vahanam, Lord Malayappa Swamy, Tirumala Tirupati Devasthanam, Tirumala Bramhotsavam, chinna shesha vahanam, Hamsa vahanam, covid-19, devotees

Tirumala diety Lord Malayappa Swamy, dressed in celestial attire as Rajadhi Raja was taken in a procession on Sarva Bhoopala Vahanam the eighth day of Srivari Navaratri Brabmotsavam on Friday.

బ్రహ్మోత్సవాల 8వరోజు: సర్వభూపాల వాహనంపై కలియుగ ప్రత్యక్ష దైవం..

Posted: 10/23/2020 06:23 PM IST
Tirumala brahmotsavam lord malayappa swamy taken in procession on sarva bhoopala vahanam

(Image source from: news.tirumala.org)

కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనమిదవ రోజు ఉదయం మలయప్పస్వామి.. రాజాధిరాజు అవతారంలో దర్శనమిచ్చారు. రాజులకు రాజుగా సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రధానం చేశారు. భూమిని పాలించే రాజులను భూపాలకులు అని, జగత్తునంతా పాలించే రాజును సర్వభూపాలుడని అంటారు. అష్టదిక్పాలకులతో పాటు సర్వభూపాలుడు  సర్వభూపాల వాహనంపై ఊరేగుతున్న చూచేందుకు రెండు కనులు సరిపోవు. సర్వభూపాల వాహనాన్ని అధిరోహించిన కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారిని దర్శించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, భాగ్యం సిద్దిస్తాయని ప్రతీతి, సర్వభూపాల వాహనంపై విహరించిన స్వామి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.

మంగళ వాయిద్యాల మధ్య జీయంగార్లు, పండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ సర్వభూపాలుడికి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. అయితే బ్రహ్మోత్సవాల ఎనమిదవ రోజున స్వామివారికి రథోత్సవాన్ని నిర్వహించడం అనవాయితి. అయితే కరోనా నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించడంతో రథోత్సవాన్ని బదులుగా సర్వభూపాల వాహనాన్ని ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు ఈ మేరకు స్వామివారిని రాజాధిరాజుగా అలంకరించిన అసీనులను చేశారు. మరీ ముఖ్యంగా రాజు కావాలంటే సర్వభూపాలుడి అనుమతి తప్పనిసరి. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే అని వేదాల వర్ణన. శ్రీహరి రాజాధి రాజు. సర్వ భూపాలురూ వాహన స్థానీయులై భగవంతుని తమ భుజస్కందాలపై మోస్తున్నారు.

కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. సాధారణంగా బ్రహోత్సవాల సమయంలో ఇసుకేసినా రాలనంతగా భక్తులు తిరుమల కోండకు చేరుకుని దేవదేవుడి వివిధ రూపాల్లో దర్శించి అభయాన్ని పోందేందుకు పోటీపడతారు. ప్రతీఏడు కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్ర తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజన సందోహానికి అభయప్రధానం చేసే శ్రీవారు ఈ సారి కరోనా నేపథ్యంలో ఆలయానికి మాత్రమే ఉత్సవాలు పరిమితమయ్యాయి, ఇక ఈ బ్రహ్మోత్సవాల వేడుకలకు కూడా పరిమితి సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. ముందుగా టికెట్లు పోందిన భక్తులతో పాటు ధర్మదర్శన టికెట్లు పోందిన భక్తులను మాత్రమే తిరుమల కోండపైకి తితిడీ అధికారులు అనుమతిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles