(Image source from: Twitter.com/ChitraKWagh)
ఉత్తర్ ప్రదేశ్ లోని హాత్రాస్ బాధిత దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలపై అక్కడి పోలీసులు టార్గెట్ చేసుకని రాహుల్ ను కిందపడేలా తోసివేయడం.. ప్రియాంక ధరించిన వస్త్రాలను టార్గెట్ గా చేసుకోవడం కనిపించింది. ఇది పోలీసులు కావాలని చేసిన అవమానంలా వున్నాయి. జాతీయ నేతలను టార్గెట్ చేసుకుని ఇలాంటి ఘటనలు జరగడం.. ఇందుకు పోలీసులను కావాలని ఫురిగొల్పినట్టు వుంది. అయితే ఈ విధంగా పోలీసులకు అదేశాలు ఇచ్చింది ఎవరన్న ప్రశ్నలు కాంగ్రెస్ అభిమానులను నుంచి వ్యక్తం అవుతున్నాయి.
హాత్రాస్ బాదితులను పరామర్శించేందుకు వచ్చిన ప్రియాంక గాందీని రెండు పర్యాయాలు అమె వస్త్రాలను టార్గెట్ చేసుకున్న ఘటనలు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య జనంలోనూ ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి. తొలిసారి వెళ్లిన సంధర్భంలో అమె వస్త్రాలను మహిళా పోలీసులు టార్గెట్ చేయగా, రెండో పర్యాయం ఏకంగా మగ పోలీసులే అమె వస్త్రాలను పట్టుకోవడం ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల వ్యవహార తీరును.. వారిని అలా ప్రేరేపిస్తున్న వారి తీరును ప్రదర్శింపజేస్తోందని కాంగ్రెస్ కార్యకర్తలు విమర్శలు సంధిస్తున్నారు. హాత్రాస్ ఘటనలో దళిత యువతిపై అగ్రవర్ణాలకు చెందిన పలువురు నిందితులు సామూహిక అత్యాచార ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పోందుతూ అమె మరణించడంతో పోలీసులే అమె మృతదేహాన్ని దహనం చేయడాన్ని బాధితరాలి కుటుంబసభ్యులు కూడా తప్పుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. పోలీసులు అగ్రనేతలపై అత్యంత జుగుప్సాకర రీతితో వ్వవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులతో పాటు తాజాగా బీజేపి పార్టీకి చెందిన నాయకురాలు కూడా పోలీసుల తీరును తప్పబట్టారు. మహారాష్ట్ర బీజేపి ఉపాధ్యక్షురాలు చిత్ర కిషోర్ వాఘ్ పోలీసులు దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. ఏ దారుణాన్ని వ్యతిరేకిస్తూ ప్రియాంకాగాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించారో అదే తరహాలో అమెపై పోలీసులు విరుచుకుపడటం క్షమార్హం కాదని దుయ్యబట్టారు. ప్రియాంక చేతిని పట్టుకుని ఓ పోలీసు ఆమెను ముందుకు రాకుండా నిలువరించడంపై అమె మండిపడ్డారు.
మహిళా నాయకురాలి దుస్తులపై అలా చేయి వేయడానికి ఆ మగ పోలీసుకి ఎంత ధైర్యం? అంటూ ఆమె నిలదీశారు. ఇది క్షమించరాని నేరంగా పరిగణించాల్సిందేనని అమె అన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై విశ్వాసం కలిగిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై తీవ్రంగా స్పందించాలని ఆమె కోరారు. సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తమ పరిమితులు తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. కాగా ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ప్రియాంకాగాంధీకి ఇవాళ క్షమాఫణలు చెప్పారు. అమె పట్ల పోలిస్ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై దర్యాప్తుకు కూడా అదేశించారు.
पुरुष पुलिस की जुर्रत कैसे हुई कि वो एक महिला नेता के वस्त्रों पर हाथ डाल सके!समर्थन मे अगर महीलाए आगे आ रही है पुलीस कही की भी हो उन्हे अपनी मर्यादा का ध्यान रखना ही चाहीए
— Chitra Kishor Wagh (@ChitraKWagh) October 4, 2020
भारतीय संस्कृती मे विश्वास रखनेवाले मुख्यमंत्री @myogiadityanath जी ऐसे पुलीसवालोपर सख्त कारवाई करे @dgpup pic.twitter.com/RfbXiIIXcI
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more