(Image source from: Cnbctv18.com)
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. నగదు విత్ డ్రాలకు సంబంధించి సరికొత్త రూల్స్ ప్రకటించింది. బ్యాంకు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు సంబంధించి అనేక మార్పులు చేసింది. నగదు విత్ డ్రాల సంఖ్యపై పరిమితులు విధించిన ఎస్ బీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పై మాత్రం కరుణ చూపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అపరిమిత లావాదేవీలకు అనుమతి ఇచ్చింది. ఇందుకు ఎలాంటి రుసుం అవసరంలేదని పేర్కొంది. అంతేకాదు, సేవింగ్స్ ఖాతాల వడ్డీరేటులో 5 బేసిస్ పాయింట్ల కోత విధించింది. తద్వారా మే 31 నుంచి 2.7 వడ్డీ శాతం వర్తింపచేయనున్నారు.
బ్యాంకు శాఖ నుంచి...
* బ్యాంకు ఖాతాలో సగటు నెలవారీ మొత్తం రూ.25 వేల వరకు ఉండే ఖాతాదారుడు బ్యాంకు శాఖ నుంచి ఒక నెలలో రెండు సార్లు మాత్రమే నగదు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.
* సగటు నెలవారీ మొత్తం రూ.25,000 నుంచి రూ.50,000 వరకు ఉంటే 10 విత్ డ్రాయల్స్ ఉచితం.
* నగదు ఉపసంహరణలకు పరిమితి దాటిని వారు ప్రతి లావాదేవీకి రూ.50కి తోడు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
* సగటు నెలవారీ మొత్తం రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు ఉంటే అపరిమిత సంఖ్యలో ఎన్నిసార్లయినా విత్ డ్రా చేసుకోవచ్చు.
ఏటీఎం నుంచి...
* సగటు నెలవారీ మొత్తం రూ.25,000 లోపు ఉంటే ఓ ఖాతాదారుడు 8 సార్లు (ఎస్ బీఐలో 5 సార్లు ఇతర బ్యాంకుల్లో 3 సార్లు) ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఈ సౌకర్యం 6 మెట్రో నగరాలకే పరిమితం చేశారు. ఇతర నగరాల్లో మాత్రం 10 ఉచిత అవకాశాలు ఇచ్చారు. ఎస్ బీఐ ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 5 అవకాశాలు ఉపయోగించుకోవచ్చు.
* సగటు నెలవారీ మొత్తం రూ.25 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఉన్న ఖాతాదారులు ఎస్ బీఐ ఏటీఎంలలో ఉచితంగా ఎన్నిసార్లయినా నగదు తీసుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో 8 సార్లు (మెట్రో సిటీల్లో 3 సార్లు, నాన్ మెట్రో నగరాల్లో 5 సార్లు) తీసుకోవచ్చు.
* నిర్దేశించిన పరిమితికి మించి ఏటీఎంల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఒక్కో ట్రాన్సాక్షన్ కు రూ.10 నుంచి రూ.20 వరకు జీఎస్టీ సహిత రుసుం వసూలు చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more