Actor Mohan Babu house arrest in Tirupati తిరుపతిలో నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్టు

Fee reimbursement row actor mohan babu house arrest in tirupati

Actor Mohan Babu house arrest in tirupati, Actor Mohan Babu house arrest, Mohan Babu house arrest, Mohan Babu fees reimbursement row, Mohan Babu, fee reimbursement dues, Chandrababu, TDP, Assembly Elections, Tirupati, Andhra Pradesh, Politics

Tollywood actor and former MP Mohan Babu took out a rally in Rangampeta of Tirupati against AP government over non-payment of fee reimbursement dues, he criticised CM Chandrababu for distributing public money towards Pasupu Kumkuma scheme.

తిరుపతిలో నటుడు మోహన్ బాబు హౌస్ అరెస్టు

Posted: 03/22/2019 12:06 PM IST
Fee reimbursement row actor mohan babu house arrest in tirupati

నటుడు, విద్యావేత్త మంచు మోహన్ బాబుని తిరుపతి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వ్యర్థ వాగ్ధానాలతో రేపటి పౌరుల జీవితాలతో ఆటలాడుతోందని.. వారి తల్లిదండ్రులను అంధకారంలోకి నెడుతోందని ఆయన మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ ఇస్తానని చెప్పిన ఐదేళ్ల పాటు అధికారంలో వున్న చంద్రబాబు.. తన పదవీకాలం ముగిసిపోతున్నా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. తక్షణం ప్రభుత్వం పిజు రియంబర్స్ మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు.

తిరుపతిలో తన పాఠశాల, కళాశాల విద్యార్థులతో ఆయన ధర్నాకి సిద్ధం అయ్యారు. మాట ఇచ్చిన ప్రభుత్వం అంటూ గళం వినిపిస్తున్నారు. విధ్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను కాలేజీలకు చెల్లించకుండా.. యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రోడ్డెక్కారు. ఎన్నికల కోడ్ అమలుల్లో ఉందని.. ధర్నాకు అనుమతి లేదని తెగేసి చెప్పారు పోలీసులు. అయినా ఆయన పట్టు వీడలేదు. ధర్నా చేసి తీరతాను అంటూ విద్యార్ధులతో కలసి బయటకు వచ్చారు. అప్పటికే ఇంటి బయట ఉన్న బలగాలు.. ఆయన్ను రోడ్డుపైకి రాకుండా అడ్డుకున్నాయి.

దీంతో తిరుపతిలో విద్యార్ధులతో కలిసి మోహన్ బాబు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధపడుతున్న క్రమంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయితే తన పంతం నెగ్గించుకున్న ఆయన బయటకు వచ్చి రంగంపేటలోని తన కళాశాల ఎదుటే తిరుపతి- మదనపల్లి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇంజనీరింగ్ విద్యార్థుల ఫీజుల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనీ.. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల దగ్గర మోహన్ బాబు నిరసనకు పిలుపునిచ్చారు.

పీజు రియంబర్స్ మెంట్ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న చెవిటివాడి ఎదుట శంఖం వూదిన విధానానికి నిరసనగా ఆయన గత కొన్ని నెలలుగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలు పర్యాయాలు ముఖ్యమంత్రికి లేఖలు రాసినా వాటికి బదులు రాలేదని, అంతటి అహంకారం నిండిన వ్యక్తులు ఏమతారో తాము చూస్తున్నామని అన్నారు. దీంతో ఇప్పటికైన ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే.. ధర్నా జరగకపోయినా ఆ సందేశం మాత్రం ప్రజల్లోకి వెళ్లేలా చేసిన మోహన్ బాబుతో టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవిద్యానికేతన్ పాఠశాలల ఎదుట పోలీసులు భారీగా మోహరించటంతో ఉద్రిక్తత నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  fee reimbursement dues  Chandrababu  TDP  Assembly Elections  Tirupati  Andhra Pradesh  Politics  

Other Articles