Lord sri varu on chinna shesha vahanam చిన్నశేష వాహనంపై సంచరించన మలయప్పస్వామి

Kanaka durga devi in gayatri devi avatar today

Kanaka Durga temple, Dasara festival celebrations, Vijayawada, Gayatri devi, Navaratri fest, simha vahanam, muthyala pandiri, Garuda Seva, Ghatasthapana, Lord Venkateswara, Navaratri, ‪Muhurta‬‬m, chinna shesha vahanam, Hamsa vahanam, indrakeeladri, Alampur

As a part of Annual Navaratri brahmotsavam, lord Sri Venkateshwara swamy had moved in Simha vahanam and in the evening hw will move on muthyala pandiri, Meanwhile Kanaka Durga devi atop Indrakeeladri hills is in Gayatri Devi Avatar and blessing devotees

గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మవారు..

Posted: 10/12/2018 11:42 AM IST
Kanaka durga devi in gayatri devi avatar today

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. తిరుమల బ్రహోత్సవాలలో భాగంగా నిన్న చిన్నశేష వాహనం, హంసవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు.. ఇవాళ మూడో రోజున తెల్లవారుజామున సింహ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించిన శ్రీవారు.. భక్తులకు అభయ ప్రధానం చేశారు. కాగా ఇవాళ రాత్రి ముత్యాల పందిరిలో ఊరేగించే శ్రీవారు.. భక్తులకు అభయ ప్రధానం చేశారు.

ఇక ఇంద్రకీలాద్రి కనకదుర్గాదేవి ఆలయంతో పాటు, శ్రీశైల బ్రమరాంభికాదేవీ ఆలయం, శ్రీకాళహస్తిలోని వాయులింగశ్వన ఆలయంతో పాటు పాలమూరు జిల్లా ఆలంపూర్ అమ్మవారి దేవాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన ఇవాళ అమ్మవారు భక్తులకు గాయత్రిదేవిగా దర్శనం ఇస్తున్నారు. గాయత్రి దేవికి అర్చక బృందాలు ప్రత్యేక అర్చనలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. కాగా, పలు దేవాలయాల్లో మాత్రం ఇవాళ అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులను అశీర్వదిస్తున్నారు.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు (శుక్రవారం) అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రీ దేవి అలంకరణలో అమ్మవారు పంచముఖాలతో అధిష్టాన దేవతగా కనిపించారు. దుర్గమ్మ శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణుమూర్తి, శిఖలో రుద్రుడు నివశిస్తుండగా అమ్మవారు త్రిమూర్తి స్వరూపంగా ప్రకాశించారు. గాయత్రి రక్షణ శక్తి గాయస్తంత్రాయతే ఇతి.. గాయత్రీ అని తనను ప్రార్ధించినవారిని అమ్మవారు సర్వదా రక్షిస్తుందని భక్తుల నమ్మకం.

మూడో రోజున గాయత్రిదేవి అలంకృతురాలైన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇక దీనికి తోడు శుక్రవారం కావడంతో.. అమ్మవారి శరన్నవరాత్రులు కూడా కలసిరావడంతో.. అమ్మవారి దర్శనానికి అన్ని దేవాలయాలతో పాటు పరమపవిత్రమైన అష్టాదశపీఠాలలోనూ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు దర్శనంతో అమ్మవారి నామస్మరణలతో ఆలయాలన్న నూతన ఆద్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గాయత్రి దేవికి ఇష్టమైన పాయసం, పంచభోగాలను నైవేద్యంగా సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles