PMK activist burns alive during rail roko in Chennai పీఎంకే ‘రైల్ రోకో’లో విషాదం.. క్షణాల్లో బూడిదైన కార్యకర్త

Pmk leader gets electrocuted while walking on train

Cauvery Management Board, Chennai, Pattali Makkal Katchi, protest, Tamil Nadu, Tindivanam railway station, Rail roko protest, PMK founder S Ramadoss

An activist of Paattali Makkal Katchi (PMK), a political party in Tamil Nadu, was burnt to ashes within seconds of coming into contact with High Tension (HT) wires, while protesting atop a running train, as part of the Cauvery stir.

ITEMVIDEOS: పీఎంకే ‘రైల్ రోకో’లో విషాదం.. హైఓల్టేజీ వైర్లు తగిలి కార్యకర్త మృతి

Posted: 04/11/2018 03:35 PM IST
Pmk leader gets electrocuted while walking on train

కావేరి మేనేజ్ మెంట్ జలమండలి బోర్డును ఏర్పాటు చేయాలని దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు అదేశాలను కూడా పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. తమిళనాడులోని పీఎంకే పార్టీ ఇచ్చిన పిలుపుతో ఓ కార్యకర్త పట్ల విషాదాంతమైంది. తన సహచర కార్యకర్తలు, నేతలు అందరూ చూస్తుండగా, రైలుపైకి ఎక్కి నడుస్తున్న పీఎంకే కార్యకర్త క్షణాలు బూడిదయ్యాడు. అతనికి ముందుగా నడుస్తున్న మరో కార్యకర్త విద్యుద్ఘాత ప్రభావానికి తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

ఇంట్లో విద్యుత్ ప్రసారం చేసే 220 వోల్ట్స్ వైర్లే ఒక్కోసారి ప్రజల ప్రాణాలను బలిగొంటాయి. అలాంటి ఒక రైలును నడింపించే 25కెవి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలితే.. అన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా వాటికి దెగ్గరగా వెళ్తున్నా ఎగిరిపడతాం. అలాంటిది రైల్ హైటెన్షన్ కరెంట్ వైరుకి తగిలిన పీఎంకే కార్యకర్త నిలువెల్లా కాలిపోయాడు. కళ్ల ముందే క్షణాల్లో బూడిద అయ్యాడు. తమిళనాడులోని తిండివనమ్ రైల్వే స్టేషన్ లో చోరబడ్డ వందలాది పీఎంకే కార్యకర్తలు అందోళన నిర్వహించారు. తమ పార్టీ పిలుపు మేరకు రైల్ రోకోను నిర్వహించేందుకు సన్నధమయ్యారు.

ఇంతలో తిండివనం రైల్వే స్టేషన్ కు వచ్చిన గురువాయూర్ ఎక్స్ ప్రెస్ ను అడ్డుకున్నారు. రైలు కదలకుండా పట్టాలపై బైఠాయించారు. ఈ క్రమంలోనే కొందరు కార్యకర్తలు రైలుపైకి ఎక్కారు. నినాదాలు చేస్తూ నడుస్తున్నారు. రంజిత్ కుమార్ అనే వ్యక్తికి రైలు పైన ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలాయి. అంతే శరీరం మొత్తం మంటలు వచ్చేశాయి. నిలువెల్లా మంటలతో క్షణాల్లో కాలి బూడిద అయ్యాడు. ఎలక్ట్రికల్ మిషన్ లో పెడితే ఎలా మాడి.. బూడిద అవుతారో అలా అయిపోయాడు. వందల మంది కార్యకర్తలు షాక్ అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles