వరుస ఓటములతో చతికిలపడుతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ కమ్యూనికేషన్స్, సోషల్ మీడియా, ఐటీ విభాగాల నిర్వహణ బాధ్యతలను వివాదాస్పద కన్నడ నటి రమ్యకు అప్పగించింది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్యానెల్ ఈ నిర్ణయం తీసుకుంది.
2012లో కాంగ్రెస్ లో చేరిన రమ్య, మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ వెనుకంజలో ఉండటంతో, దాన్ని మరింతగా పుంజుకునేలా చూడాలని భావిస్తున్న కాంగ్రెస్, ప్రస్తుతం ఆ విభాగానికి హెడ్ గా ఉన్న దీపీందర్ హూడా సరిగ్గా పనిచేయలేక పోతున్నారని పార్టీ భావిస్తోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ట్వీట్లు చేస్తుండటం, దాదాపు 4.83 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం రమ్యకు ప్లస్ పాయింట్ అయింది.
Does the Home ministry have a job or not?Intel failure.
— Divya Spandana/Ramya (@divyaspandana) April 24, 2017
No one is safe with this Govt.Not the army not the civilians nor our Aadhar details- https://t.co/AjgkPNnUbq
కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా కూడా మెప్పించిన ఆమె సోషల్ మీడియాలో ప్రభుత్వ నిర్ణయాలను ఏకీ పడేస్తుంది. సీనియర్ నేత శశిథరూర్ లాంటి వాళ్లు ఆమెను తరుచూ రెబల్ వాయిస్ అంటూ పొగటం తెలిసిందే. ఫలితాలు రాబట్టలేకపోతున్న హుడాను తప్పించి ఐటీ విభాగం పదవిని అప్పగిస్తే మేలు కలుగుతుందన్న అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్, త్వరలోనే ఈ విషయమై కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more