బలపరీక్షలో గనుక ఓడిపోయినట్లయితే మరో ఉద్యమానికి తెరలేపబోతున్నాడు విధేయుడు పన్నీర్ సెల్వం. పళనిస్వామికి సపోర్ట్ గా గనుక ఎమ్మెల్యేలు ఓట్లు వేసినట్లయితే వారిని ప్రజా కోర్టకు ఈడ్చేందుకు సిద్ధమవుతానని ప్రకటించాడు కూడా. మరోవైపు నేడు బలనిరూపణ సందర్భంగా కాసేపట్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. మధ్యాహ్నాం నుంచి ఓటింగ్ ప్రారంభయ్యే అవకాశం ఉంది. అయితే రహస్య ఓటింగ్ చేపట్టాలంటూ స్పీకర్ పై పన్నీర్ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
ఇదిలా ఉంటే భారీ కాన్వాయ్ నడుమ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. చెన్నై లో ఎప్పుడు ఏం అలజడి రేగుతుందోనన్న పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు భద్రతను పెంచారు. తేని జిల్లా బోడియనాయకనూర్ లోని పన్నీర్ సెల్వం కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డకున్న పన్నీర్ మద్ధతుదారుడు రాజ్ వేల్ పై దాడి చేశారు కూడా. మరోవైపు పళని ఎమ్మెల్యేల సంఖ్య 122కి పడిపోయింది. నిన్న రాత్రి రిసార్ట్ నుంచి బయలుదేరిని మరో ఎమ్మెల్యే అరుణ్ కుమార్ ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటానని చెబుతూ ఓటింగ్ కు దూరమని ప్రకటించాడు.
కాగా, 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో జయ మృతిలో ఒక స్థానం ఖాళీగా ఉండగా, బలపరీక్ష గెలవాలంటే 116 మంది సభ్యుల మద్ధతు ఈపీఎస్ కు అవసరం. మరో ఆరుగురు ఎమెల్యేలు గనుక చేజారితే మాత్రం పళనీ పరిస్థితి ఇక అంతే. 40 మంది అసంతృప్తులు ఉన్నారన్న వార్త కాస్త కంగారు పెడుతోంది.
ఇక ఓటు వేసే ముందు అమ్మను తలుచుకోవాలంటూ పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చాడు. ప్రజలు అమ్మను చూసే అధికారం కట్టబెట్టారని, కుటుంబ పాలనకు ఆమె పూర్తి విరుద్ధమని, శశికళ లాంటి వాళ్ల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లితే సర్వనాశనం అవుతుందని ఈ ఉదయం మరోసారి మీడియా సాక్షిగా ఎమ్మెల్యేలను కోరాడు. ప్రతిపక్ష డీఎంకే తరపున అనారోగ్య సమస్యతో కరుణానిధి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
బలాబలాలు..
అన్నాడీఎంకే - 135 (124 మంది సపోర్ట్ ఉన్నారని పళని చెబుతున్నాడు)
డీఎంకే - 89
కాంగ్రెస్ - 8
ముస్లింలీగ్ - 1
పన్నీర్ వర్గం - 11
డీఎంకే వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పగా, కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారంలో చివరి నిమిషంలో వ్యతిరేక ఓటుకే మొగ్గుచూపింది.. మిగతా వారు తటస్థంగా ఉండే అవకాశం ఉంది?
పళనియమ్మ జోక్... పేలిపోతుంది
దివంగత ముఖ్యమంత్రి జయలలితను తమిళనాడు ప్రజలు ముద్దుగా అమ్మ అని పిలుచుకుంటారని తెలిసిందే. మరోవైపు ఆమెను అనుసరిస్తూ వచ్చిన శశికళ నటరాజన్ ను కూడా చిన్నమ్మ అని సంభోదిస్తూ వస్తున్నారు. వీళ్ల విషయంలోనే కాదు.. తమిళనాడులో కాస్త క్రేజ్ తో జనాల్లోకి దూసుకెళ్లిన వాళ్లను తంబీలు ఏదో ఒక వరుసపెట్టి పిలవటం సహజమే. అన్నాడీఎంకే లో అది కాస్త ఎక్కువగానే ఉంటుంది. పురుచ్చితలైవా, పురుచ్చితలైవి తర్వాత విమర్శలు వచ్చినప్పటికీ చిన్నమ్మకు కూడా అంతే ప్రాధాన్యం ఇచ్చారు కూడా.
ఇదిలా ఉంటే, కొత్త సీఎం పళనిస్వామి విషయంలోనూ ఇప్పుడు ఇదే జరిగింది. కాకపోతే సీన్ కాస్త కామెడీగా మారిపోయింది. అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ పళనిస్వామి గురించి గొప్పగా వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో కాస్త అతితో పళనిస్వామికి బదులు ‘పళనియమ్మ’ అనేసింది. అంతే ఆమెపై జోక్స్ పేలుతున్నాయి.
ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరడంతో జోక్స్ కురిపిస్తున్నారు. ‘అమ్మ’, ‘చిన్నమ్మ’ అని పలికిన నోటికి ‘పళనియమ్మ’ అని కాక, ఇంకేమొస్తుందంటూ ట్రోల్స్ చక్కర్లు కొడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more