గ్యాంగ్ స్టర్ గా తెలుగు రాష్ట్రాలను గడగడలాడించి ఎన్ కౌంటర్ లో హతమైన నయీంకు సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దందాలతో వందల కోట్ల సంపాదించిన నయీంకు పోలీస్ శాఖలోని కొందరు కీలక అధికారులు, రాజకీయనేతలతో సత్ససంబంధాలు ఉండేవని ఆ మధ్య బయటపడింది. అయితే ఎటువంటి ఆధారాలు లేవంటూ నయీం కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) కోర్టుకు తెలుపటం విశేషం. ఈ నేపథ్యంలో నయీం దందాకు సహకరించిన పోలీసుల వ్యవహారాలు బట్టబయలు చేస్తున్న కొన్ని ఫోటోలు బట్టబయలయ్యాయి.
సుమారు 16 మంది పోలీసు ఉన్నతాధికారులు నయీంతో విందు వినోదాలు చేస్తున్న ఫోటోలు బహిర్గతమయ్యాయి. ఈ ఫోటోలు పోలీసుల చేతికి చిక్కినప్పటికీ సిట్ అధికారులు వారిని పక్కకి తప్పించడం పలు అనుమానాలకు తావినిస్తోంది. ముఖ్యంగా సీడీఐ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. వాళ్లిద్దరూ కలిసి ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో బయటకు వచ్చింది. గతంలో నల్లగొండ జిల్లాలో పని చేసి ప్రస్తుతం సీఐడీలోనే ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి.
మద్దిరెడ్డితో లింకులు...
మద్దిరెడ్డి గతంలో కీలకమైన విభాగాల్లో ఎస్ఐ స్థాయి నుంచి పనిచేశారు. నయీంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయని అంటున్నారు. కీలకమైన సమాచారం అందజేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ నయీంకి సహకరించేవాడని మద్దిపాటిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే సరైన సాక్ష్యాధారాలు లేవంటూ సిట్ తేల్చటంతో కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆధారాలు బయటకు రావడంతో ఇక ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
నయీం పోలీసు అధికారుల సాయంతోనే గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడని, బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు లేవని ఈ ఫోటోలు పేర్కొంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. విపక్షాలు సీబీఐ విచారణ కోరున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరించడం, నయీం ఇళ్లపై దాడులు చేస్తున్న సందర్భంగా పట్టుబడ్డ నగదు, నగలు, డాక్యుమెంట్లను గోల్ మాల్ చేయడానికేనని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కుంటున్న వాళ్లకు క్లీన్ చిట్ ఇవ్వటంతో నచ్చని కొందరు సిట్ అధికారులే ఈ ఫోటోలను లీక్ చేశారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more