దేశంలో ప్రకంపనలు రేపిన ఆగస్టా వెస్ట లాండ్ కుంభకోణంలో మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎస్పీ త్యాగిని శుక్రవారం అరెస్ట్ చేశారు. సుమారు 3700 కోట్ల ఈ స్కాంలో ఆయన హస్తం ఉన్నట్లు సీబీఐ ధృవీకరించింది. సంచలనం రేపిన ఈ భారీ కుంభకోణంలో త్యాగిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆరోపణలు రుజువుకావటంతో ఆయన్ని అరెస్ట్ చేసింది.
డీల్ కోసం సంప్రదింపులు జరిపే సమయంలో ఎస్పీ త్యాగిని ఇటలీ మధ్యవర్తులు కోడ్ నేమ్ తో సంబోధించే వారనిట. తమ సంభాషణల్లో త్యాగిని 'అపురూప లావణ్యవతి' (ఇటలీ భాషలో గియులి లేదా గియులియా)గా సంబోధించేవారని ఇదివరకే సీబీఐ బయటపెట్టింది. మార్చి 25, 2012లో వీరిద్దరినీ మిలాన్ లోని మల్పెన్సా ఎయిర్ పోర్టులో త్యాగి కలుసుకున్నాడని సీబీఐ, ఈడీ అధికారులు సేకరించిన పత్రాల్లో తెలిపింది. " ఆపై తిరిగి వెళుతూ, చాపర్ డీల్ లో ఇటలీ విచారణ పట్ల గియులియా ఆందోళన వ్యక్తం చేశారు" అని ఆ పత్రాల్లో ఉన్నట్టు సమాచారం.
ఇదే కేసులో ఇప్పటిదాకా 13 మందిని విచారించిన సీబీఐ ఎయిర్ మార్షల్ చీఫ్ గా ఉన్న సమయంలో త్యాగి ఆగస్టా మాతృక కంపెనీ ఫిన్ మెక్కానియాను సందర్శించాడన్న ఆధారాలు ఉన్నట్లు తెలిపింది. హెలికాఫ్టర్ల ఎత్తు ఆరు వేల నుంచి 4000 ఉండాలని తయారీ కంపెనీకి ఆయన సూచించనట్లు వివరించింది. ఈ స్కాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ హస్తం ఉందని బీజేపీ ఆరోపణలు చేయగా, పలువురు గవర్నర్ల పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన నిఘా వ్యవస్థ ఇదివరకే వారిని విచారించింది. హెలికాప్టర్ల సర్వీస్ పరిమితికి సంబంధించి చేసిన మార్పులపై ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ డెరైక్టర్, ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కూడా అందులో ఉన్నారు.
ఆగస్టా ఎందుకోసం...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more