పాత నోట్ల రద్దుతో ఇక్కట్లు ఎదుర్కుంటున్న ప్రజలకు కాస్త ఇబ్బంది కలిగించే వార్త ఇది. డిసెంబర్ 2 అర్థరాత్రి నుంచి 500 రూపాయల నోట్లు పెట్రోల్ బంక్ లలో కూడా చెల్లకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికాసేపట్లో దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన వెలువరించింది. ఇప్పటికే 1000 నోటు చెల్లకుండా, కేవలం ఆర్బీఐ బ్రాంచ్ లలోనే మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ముందు డిసెంబర్ 15 వరకు అవి చెల్లుబాటు అవుతాయని చెప్పినప్పటికీ, ప్రస్తుతం కొత్త కరెన్సీ దాదాపు అందరికీ అందుబాటులోకి రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం పాత నోట్లు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రం చెల్లుబాటు అయ్యేలా ఆర్బీఐ వెసులు బాటు కల్పించి, ఆపై రాను రాను ఆ నిబంధనలను కఠినతరం చేస్తూ వచ్చింది. ప్రస్తుత నిర్ణయంతో డిసెంబర్ 3 నుంచి పెట్రోల్ బంకులతోపాటు ఎయిర్ పోర్ట్ లలో కూడా పాత 500 నోట్లు చెల్లవు. ఇక రూ. 1000, రూ. 500 కాగితాలు ఎవరి వద్దనైనా ఉంటే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయక తప్పనిసరి పరిస్థితి. కాగా, రూ. 500 కాగితాలతో కరెంటు బిల్స్ వంటివి మాత్రం చెల్లించే అవకాశం మరో రెండు వారాలు కొనసాగనుంది.
ఇక నోట్ల రద్దు పుణ్యమా అని వాహనదారులకు గత 20 రోజులుగా టోల్ ట్యాక్స్ కట్టే బాధ తప్పిన విషయం తెలిసిందే. నవంబర్ 11 నుంచి టోల్ టాక్స్ ను రద్దు చేస్తూ ఆ పై పలుమార్లు పొడిగించుకుంటూ వచ్చింది. ఇక డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి దాటాక మళ్లీ వాహనదారులు యథావిధిగా టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే చిల్లర సంక్షోభం మరోమారు తలెత్తకుండా ఉండేందుకు ఈనెల 15 వరకు రద్దయిన పాత రూ.500 నోట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే టోల్ కౌంటర్ల వద్ద ఎస్బీఐ కార్డు స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more