కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం దీక్ష విరమించారు. తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 14 రోజులుగా ఆయన చేస్తున్న దీక్షను ఎట్టకేలకు ముగింపు పలికారు. ఆస్పత్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహం చేరుకున్న ఆయనచేత కాపు సంఘాల నేతలు దీక్ష విరమింపజేశారు.
ఈ సందర్భంగా ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ‘ఊపిరి ఉన్నంత వరకు నా జాతి కోసం పోరాడతా’నని అన్నారు. ‘ఎన్ని అవమానాలయినా భర్తిస్తాను.. ఇచ్చిన హామీని నెరవేర్చండి. హమీలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం నుంచి చల్లని కబురు వచ్చే వరకు నేను ఏ పండుగ చేసుకోనూ’ అంటూ ప్రకటించారు. తన కుటుంబ సభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల ఆయన కంటతడి పెట్టుకున్నారు.
కొడుకుపై లాఠీఛార్జీ చేస్తూ బూతులు తిట్టారని ముద్రగడ ఆరోపించారు. ఎటువంటి ప్రతీకార చర్యలకు దిగబోమని, న్యాయంగా పోరాడతామని తెలిపారు.
తుని విధ్వంసకారుల పేరిట అరెస్ట్ చేసిన కాపులను విడుదల చేయడంతోపాటు అమాయకపు వ్యక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే ఆమరణ దీక్షకు దిగారు. ఆపై ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఆసుపత్రిలోనూ దీక్ష విరమణకు ససేమిరా అన్న ముద్రగడ.. అరెస్టైన కాపులంతా బెయిల్ పై విడుదల కావడంతో నేటి ఉదయం దీక్ష విరమించారు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more