భారత్ మాతాకీ జై అని అనాలా వద్దా..? అనే అంశంపై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. తాజాగా మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యల మీద సర్వత్రా చర్చ సాగుతోంది. భారత్మాతాకీ జై అనే నినాదం చేయడం ఇష్టంలేనివారికి దేశంలో నివసించే అర్హత లేదని నాసిక్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో అన్నారు. విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలుపొచ్చు, కానీ భారత్మాతాకీ జై నినాదాన్ని వ్యతిరేకించొద్దన్నారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసినవారికి మద్దతు పలికిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్పై విమర్శలుచేశారు. ఈ నినాదాన్ని వ్యతిరేకించేవారిని భారతీయులు సహించరని హెచ్చరించారు.
భారత్ మాతాకీ జై అని బారత్ లో కాకుండా ఎక్కడ అంటారు అని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రశ్నించారు. బారత్ లో ఉంటూ భారత్ మాతాకీ జై అని అనకుండా పాకిస్థాన్ కు జై అంటారా..? లేదంటే చైనాకు అంటారా..? అని ఫడ్నవిస్ నిలదీశారు . మరోపక్క ముస్లింలు భారత్మాతాకీ జై అని నినదించొద్దని దేశంలోని అతిపెద్ద ఇస్లామిక్ సెమినరి దారుల్ ఉలూం దేవ్బంద్ ఫత్వా జారీచేసిన మరుసటి రోజే ఫడ్నవిస్ ఈ వ్యాఖ్యలుచేశారు. మహారాష్ట్ర సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత పీసీ చాకో ఘాటుగా స్పందించారు. భారత ప్రజాస్వామ్య ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఇతరులను ఆదేశించలేరన్నారు. ప్రతి పౌరుడికి భావప్రకటనాస్వేచ్ఛ ఉన్నదని, ఈ విషయన్ని పౌరుల విచక్షణకే వదిలేయాలన్నారు. ఒకవేళ నిరంకుశ విధానాలు అవలంబించాలని భావిస్తే అది వారికే బెడిసికొడుతుందని ఆరెస్సెస్, బీజేపీలను హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more