మహారాష్ట్రలో తాజాగా సముద్ర స్నానానికి వెళ్లి 13 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అప్పటివరకూ జాలీగా సాగిన విహారయాత్రను విషాద యాత్రగా మారింది. ఈ ఘటన మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని మురుద్ బీచ్ లో జరిగింది. పుణెలోని అబేడా ఇనామ్ దార్ కాలేజీ నుంచి 130 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు కాలేజీ టూర్ లో భాగంగా హాలిడే స్పాట్ మురుద్ బీచ్ వెళ్లారు. వారిలో 18 మంది అరేబియా సముద్రంలో స్నానానికి దిగారు. కాసేపటికే అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. తప్పుకుని తీరానికి చేరుకుందామనుకునేలోపే క్షణాల్లో వారిని లోపలికి లాగేసింది.
వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్ గార్డ్స్ హెలికాప్టర్లు, రెస్క్యూ బోట్లు ఐదుగురిని కాపాడగలిగాయి. కానీ మిగతావారంతా నీళ్లలో మునిగి మృతి చెందారు. దాదాపు రెండు గంటల గాలింపు తర్వాత వారి మృతదేహాలు లభించాయి. మృతుల్లో 10 మంది అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇంకా పది లేదా పన్నెండు మంది విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉందంటున్నారు అధికారులు.
విద్యార్థులందరూ బీఎస్సీ, బీసీఏ ఫస్ట్, సెకండ్, ఫైనలియర్ విద్యార్థులు. ఈ ఘటనతో పుణెలోని ఇనామ్ దార్ కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది. విషయం తెలిసి కాలేజీ చేరుకున్న తల్లిదండ్రులంతా.. చెట్టంత ఎదిగిన తమ పిల్లలు ఇక లేరని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. గుండెలవిసేలా రోదించారు. చనిపోయిన విద్యార్థులంతా పుణెకు చెందిన వాళ్లే. వీరి వెంట ఐదుగురు సిబ్బంది, ఇతర సహాయకులు కూడా ఉన్నారు. కానీ విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్తున్నప్పుడు వారిని అప్రమత్తం చేయలేదు, ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదు. లైఫ్ జాకెట్లు లేకుండానే సముద్రంలోకి వెళ్లడం వల్లే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని లైఫ్ గార్డ్స్ చెబుతుంటే.. బీచ్ లో భారీ అలలు వస్తాయని కనీసె హెచ్చరిక బోర్డులు కూడా పెట్టలేదని విద్యార్థులు ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more