సమాజం పూర్తిగా మారిపోయింది.. డబ్బుల మాయలో పడి తూలుతున్న ప్రజలు దాన్ని ఆర్జించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పురుషులు మాత్రమే కాదు.. మహిళలూ సైతం తామేమీ తక్కువేం కాదన్నట్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యాపారలేవాదేవీల్లో అనుభవమున్న మహిళలు ఇతరులకు టోకరా వేయడంలో తామే దిట్టగా నిరూపించుకుంటున్నారు. ఇదివరకే ఇలా ఎంతోమంది మహిళలు రకరకాల మోసాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కవ్వగా.. తాజాగా మరో మహిళ భారీ మోసం చేసి పట్టుబడింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఊచలు లెక్కిస్తోంది.
ప్రముఖ బ్యూటీషియన్ అయిన యలమంచిలి నందిని చైదరి(29) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లో ‘బ్లష్ స్పా అండ్ సెలూన్’ను నిర్వహిస్తోంది. దీంతోపాటు ఆభరణాల వ్యాపారం కూడా చేస్తోంది. తన స్పాకు వచ్చే సంపన్న మహిళలకు ఆమె ఈ నగలు చూపించి విక్రయిస్తోంది. ఇందులో భాగంగానే హుస్సేనిఆలంకు చెందిన ఆభరణాల వ్యాపారి సోమెన్ఘోష్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏమిటంటే.. అతని దగ్గరు నుంచి 5 నెక్లెస్లు తీసుకున్న ఆమె.. వాటిని అమ్మిపెడతానని చెప్పింది. ఆ నెక్లెస్ లు అమ్ముడుపోతే అందుకుగాను రూ.50 లక్షలు ఇస్తానని ఆమె చెప్పగా.. సోమెన్ ఆ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే.. ఆమె మాత్రం వాటిని తన జల్సాలకు వినియోగించుకుంది. వాటిలో మూడు నెక్లెస్లను పాన్బ్రోకర్ వద్ద తనఖా పెట్టి రూ. 10 లక్షలు తీసుకుంది కానీ వాటిని తన స్వంత స్వలాభాల కోసం వాడుకుంది. ఇక మిగిలిన రెండు నెక్లెస్లను తాను ఇదివరకే చేసిన అప్పు తీర్చేందుకు మరో ఇద్దరికి ఇచ్చేసింది. ఈ విధంగా ఆ బ్యూటీషియన్ ఐదు నెక్లెస్ లను వాడేసుకుంది.
ఈ విషయం తెలుసుకున్న సోమెన్.. తన నెక్లెస్ లు లేదా ఒప్పందం ప్రకారం రూ. 50 లక్షలు ఇవ్వాలని అడిగాడు. తొలుత డబ్బులిస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ఆమె.. చివరకు ఇవ్వనంటూ ముఖం చాటేసింది. దీంతో బాధితుడు నందినిచౌదరి తనను మోసం చేసిందని ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 420, 406, 506ల కింద కేసులు నమోదు చేసి గురువారం రిమాండ్కు తరలించారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more