మేదావులు మాట్లాడే మాటలు కాస్త మూర్ఖంగా అనిపించినా అదే నిజం అని చాలా మంది అంటారు. కానీ మన దేశంలో మేధావులు మాట్లాడే మాటల్లో చాలా మంది మాటలు మూర్ఖంగా... ఏ మాత్రం నమ్మశక్యం కానట్లు.. పైగా వివాదాలకు కేంద్ర బిందువులగా నిలుస్తాయి. తాజాగా మరోసారి తన మాటల తూటాలతో వివాదానికి తెర తీశారు మాజీ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ. అయితే మొన్నటికి మొన్న గాంధీ మీద వివాదాస్పద వ్యాఖ్యలే చేసి అందరికి చేత చివాట్లుతిన్న మార్కండేయ కట్జూ తాజాగా మరోసారి స్వాతంత్ర సమరయోధుల మీద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దేశం మొత్తంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ మీద త్వరలోనే 60 పత్రాలను అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పశ్చియమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటి్కే వెల్లడించారు.
నేతాజీ గురించి దేశం మొత్తం ఒక చర్చసాగుతుంటే అసలు నేతాజీ ఎలాంటి వారో తెలుసా..? అతనో జపాన్ ఏజెంట్ అని తన బ్లాగ్ లో మార్కండేయ కట్జూ చేసిన వివాదాస్పద వ్యాసం కొత్త చర్చకు దారి తీసింది. అందులో నేతాజీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు నేతాజీ గురించి దేశం మొత్తం ఆసక్తికర చర్చసాగుతోంది.. అయితే విలువలకు, సంప్రదాయాలకు ఎంతో పేరున్న బెంగాల్ గడ్డ మీదున్న ప్రజలు కూడా అదే విశ్వాసాలను నమ్ముతున్నారని.. కానీ అవన్నీ నిజాలు కావని అన్నారు. త్వరలోనే తాను కోల్ కత్తాలో ఓ సభలో పాల్గొంటానని.. అక్కడ నేతాజీ గురించి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఆధారాలతొ సహా నిరూపిస్తానని అన్నారు. మొత్తానికి నేతాజీ మీద, ఠాగూర్ మీద మార్కండేయ కట్జూ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు మీడియాలో మార్కండేయ కట్జూ మీదే చర్చ సాగుతోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more