తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ విధానాలపై హైకోర్టు సీరియస్ అయింది. తెలంగాణలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయడం, ఏపీలో ఇసుక రీచ్ ల వ్యవహారంపై.. ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని అభిప్రాయపడింది. పూర్తి నివేదికలను కోర్టుకు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించిన పలు అంశాలపై విచారణ జరిగింది. తెలంగాణలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయడంతో పాటు బైక్ తో పాటు హెల్మట్ కొనాలని ఆదేశిస్తూ జారీ అయిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇన్నాళ్లు మీరేం చేశారని రవాణా శాఖను కోర్టు ప్రశ్నించింది. 14 నెలల్లో 92 వేల కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే హెల్మెట్ పై 15 రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించి.. ఆ తర్వాత హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా డ్వాక్రా గ్రూపులకు రీచ్ అనుమతులు ఇవ్వడంపై కలెక్టర్స్ తీరును తప్పుపట్టింది. సహజ వనరులు భవిష్యత్ తరాలకు ఉండాల్సిన అవసరముందని వాఖ్యానించింది. నీటి పరిరక్షణ కూడా కలెక్టర్ పరిధిలోకే వస్తుందని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. మిషన్ తో ఇసుక తీయడానికి ఎలా అనుమతిస్తారని అసహనం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో దీనిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్స్ కు ఆదేశాలు జారీ చేసింది.అయితే గతంలోనూ తెలంగాణలో ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్ అయింది. ఎవరెవరు మాఫియా వెనుక ఉన్నారో వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇష్టానుసారంగా అనుమతులివ్వడంతోనే ఇసుక మాఫియాలు ఏర్పడుతున్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more