నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్ లో రెండురోజులుగా ఆపి ఉంచిన ఓ కారు నుంచి పోలీసులు ఒకటిన్నర కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ ఐసీఐసీఐ బ్యాంకులో చోరీకి గురైన డబ్బుగా గుర్తించారు. గురువారం సూర్యాపేట పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎంఏ అబ్దుల్ రశీద్ వివరాలు తెలిపారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్లో ఖమ్మం బస్సులు ఆగే ప్లాట్ఫాం నుంచి బయటకు వెళ్లే మార్గంలో 50 మీటర్ల దూరంలో చెట్ల మధ్యలో ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ కారు(కేఏ 28ఎన్ 9119) రెండు రోజులుగా ఆగింది. ఎప్పుడూ బస్టాండ్కు రద్దీ ఎక్కువగా ఉండటంతో కారు ప్రయాణికులదే కావొచ్చని ఎవరూ పట్టించుకోలేదు. నిన్న రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ, పోలీస్ బృందం జేసీబీతో కారు డిక్కీని పగులగొట్టి ఓ బస్తామూట స్వాధీనం చేసుకున్నారు.
తీరా డిక్కీలోని మూటను విప్పి చూస్తే వెయ్యి రూపాయల నోట్ల కట్టలు 20 లక్షలు, 500 నోట్ల కట్టలు 1.30 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. డబ్బును పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి భద్రపరిచారు. క్రేన్ సహాయంతో కారును స్టేషన్కు తరలించారు. నోట్లకట్టలపై బీజాపూర్ ఐసీఐసీఐ బ్యాంకు ముద్రలను గుర్తించారు. మూడు రోజుల కిందట బీజాపూర్లోని ఐసీఐసీఐ బ్యాంకులో చోరీ చేసిన డబ్బు కారులో తరలిస్తూ రెండు రోజుల కిందట సూర్యాపేటలో వదిలేసి వెళ్లినట్లు సమాచారం. బ్యాంకు ఉద్యోగిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగల ముఠా ఆచూకీ లభించింది. సూర్యాపేటలో కారును వదిలేశామని, డబ్బులు అందులో ఉన్నాయని నిందితులు అంగీకరించినట్లు తెలిసింది. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే సూర్యాపేటలో కారు నుంచి పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఫక్రుద్దీన్ అహ్మద్ నదాఫ్ పేరుతో బీజాపూర్లో ఈ ఏడాది మే రెండో తేదీన కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. సూర్యాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more