జమ్మూకాశ్మీర్లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన సందర్భాంగా వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారం కావడంతో శ్రీనగర్లో భారీ ఎత్తున ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో ముఖాలకు మాస్క్ లను అడ్డుగా పెట్టుకున్న యువత ఐఎస్ఐఎస్ జెండాలను, పాకిస్థాన్ జెండాలను ప్రధర్శించారు. అనంతరం వేర్పాటువాదుల ర్యాలీ నిర్వహించారు. వేర్పాటు వాదుల ర్యాలీ, ఉగ్రవాద, పాకిస్థాన్ జెండాలను ఎగురవేయడంతో జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఉద్రిక్తతలు తలెత్తాయి.
ర్యాలీలో ముఖాలకు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు పాకిస్థాన్, ఐఎస్ఐఎస్ జెండాలను చేతబట్టి.. పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. కానీ వేర్పాటు వాదులు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు రువ్వుతూ.. ఉద్రిక్త పరిస్థితులను తలెత్తేలా చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. అయినా వినని ఆందోళన కారులు పోలీసులతో సవాల్ విసిరే స్థాయిలో రాళ్ల వర్షం కురిపించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాగా జమ్మూకాశ్మీర్లో ఐసిస్ జెండాలు ఎగురవేయడం శ్రీనగర్ ప్రాంత ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. అసలే వేర్పాటువాదుల గోల, మరోవైపు పాకిస్థాన్ తీవ్రవాదులతో ఇబ్బందులు పడే జమ్మూకాశ్మీర్ ప్రజలకు ఐసిస్ ప్రభావం కనిపించడం ఆవేదనను మిగిల్చింది. గతంలో పలు పర్యాయాలు ఇదే పరిస్థితులు ఉత్పన్నమైనా.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో కూడా మరోమారు ఉగ్రవాద జెండాలు ఎగరడంపై విపక్షాలు విమర్శలను గుప్పించాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more