‘ఓటుకు నోటు’ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైల్లో శిక్ష అనుభవిస్తున్న టీ-టీడీపీ ఎమ్మెల్యేకి దాదాపు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జస్టిస్ రాజాఇళంగో చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఈ కేసులో భాగంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాడీవేడీ వాదనల అనంతరం జస్టిస్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం వెలువడే తీర్పులో రేవంత్ కి బెయిల్ వచ్చే సూచనలున్నాయని వార్తలొస్తున్నాయి.
ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్ తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా, ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిలు తమ వాదనలు వినిపించారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ వాదనల్లో భాగంగా రేవంత్ కి బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ వాదించింది. ఒకవేళ ఇస్తే కేసు తారుమారవుతుందని పేర్కొంది. అటు రేవంత్ తరఫున న్యాయవాది వెయిల్ ఇవ్వాల్సిందేనంటూ వాదించారు. వారిద్దరి వాదనలను సావధానంగా విన్న జస్టిస్ రాజాఇళంగో.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
నిందితుడు రేవంత్ కి బెయిల్ ఇవ్వరాదని వాదిస్తూ ఏసీబీ చూపుతున్న కారణాల్లో మొత్తం ఏడు అంశాలున్నాయని జస్టిస్ పేర్కొన్నారు. అయితే.. ఆ ఏడింటిలో కేవలం రెండు అంశాలే హేతుబద్దంగా వున్నాయని.. మిగిలిన ఐదు కారణాలకు ఏమాత్రం హేతుబద్ధత లేదని వ్యాఖ్యానించారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ అందలేదనో, కాల్ డేటా కారణాలతోనో బెయిల్ నిరాకరించలేమన్నారు. నిందితులు పారిపోతారనడానికి తగిన ఆధారాలు లేవన్నారు.
ఇక ‘కేసు డైరీ’ని పరిశీలించిన జస్టిస్.. సీ.ఆర్.పీ.సీ సెక్షన్ 41 ప్రకారం నిందుతుల అరెస్టుకు గల కారణాలను నమోదు చేయలేదని ఏసీబీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఏడేళ్లవరకు శిక్షపడే అవకాశమున్న కేసుల్లో.. అరెస్టుకు గల కారణాలు నమోదు చేయాల్సిన అవసరం వుందన్నారు. ఈ విధంగా జస్టిస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. మంగళవారం ఆయనిచ్చే తీర్పులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తారన్న వాదన వినిపిస్తోంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more