ఏపి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నిర్వాకాన్ని ఎండగట్టడంతో పాటుగా కేసీఆర్ పై ఉన్న కేసులను చకచకా బదాయిస్తోంది. అందులో భాగంగా ఓటుకు నోటు కేసులొ నాలుగో నిందితుడు ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదును ఏపి ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది. అందులో భాగంగా సిట్ ను ఏర్పాటు చేసి.. కేసు విచారణలో వేగం పెంచింది ఏపి సర్కార్. అయితే ముత్తయ్యను ఇంటలిజెన్స్ ఎస్పీ కోటేశ్వర్ రావ్ విజయవాడలోని కార్యాలయంలో విచారిస్తున్నారు. ముత్తయ్య ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్, ఇతరులపై చర్యలకు ఏపి సర్కార్ యోచిస్తోంది. మరోపక్క కేంద్ర .ప్రభుత్వం మీద కూడా చంద్రబాబు నాయుడు వత్తిడి తీసకువస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ చేసినట్లు సమాచారం. గవర్నర్ కు కూడా పరిణామాలపై వివరించనున్నట్లు తెలుస్తోంది.
మరికొద్ది సేపట్లో జరిగే ఏపి మంత్రి మండలి సమావేశంలో కీలక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతోంది.? తర్వాత ఏపి ఎలాంటి వ్యూహాలను అవలంబించాలని ఏపి క్యాబినెట్ లో చర్చించనున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడుతో పాటు ఏపి మంత్రులు అందరూ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ఈ సమావేశానికి సిఎం రమేష్, సుజనా చౌదరి, కేంద్ర మంత్రి అశొక గజపతిరాజు కూడా హాజరవుతారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం దూకుడుకు కళ్లెం వెయ్యాలంటే ఏపి ప్రభుత్వం ఎక్కడా తగ్గకూడదని ఏపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి మొత్తానికి ఏపి ప్రభుత్వం దూకుడు మీదుంది. తెలంగాణ ప్రభుత్వానికి దీటుగా జవాబివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఏపి కేబినెట్ ఇంకా ఎలాంటి నిర్ఱయాలు తీసుకుంటుందో, ఏఏ అంశాల మీద చర్చిస్తుందో కాసేపట్లో తెలుస్తుంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more