డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్, పేసర్ జహీర్ ఖాన్ టీమిండియాలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే! గాయాల కారణంగా జహీర్ దూరం కాగా... జట్టు వ్యూహాలకు సరిపోడంటూ యువీని జట్టు నుంచి తీసేసి పక్కకు పెట్టేశారు. అయితే.. యువీని ఈ విధంగా పక్కనపెట్టడంపై ధోనీ అప్పట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాదు.. ఇటీవలే జరిగిన వరల్డ్ కప్ టీమిండియా ఓడిపోగా అప్పుడు కూడా యువీ అంశం తెరమీదికొచ్చింది. జడేజా లేదా ఇతర ఏ ఆటగాడి స్థానంలోనైనా యువీని తీసుకుని వుండుంటే.. రిజల్ట్ మరోలా వుండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే.. టీమిండియా యాజమాన్యం దాన్నెలాగో సమర్థించుకుందిలెండి!
ఇదిలావుండగా.. యువీ, జహీర్ తిరిగి టీమిండియాలో స్థానం దక్కించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ పోటీల్లో తమ సత్తా చాటుకుని భారత్ జట్టులో స్థానం మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని ఇద్దరూ పట్టుదలతో వున్నారు. ఐపీఎల్ మీద తమ భవితవ్యం ఆధారపడి వుందన్న అభిప్రాయాన్ని ఇద్దరూ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే యువీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకొని ఫిట్ గానే వున్నా. ఈ రెండేళ్లు నాకు ఎంతో కష్టంగా గడిచాయి. దేశవాళీల్లో రాణించి ఆత్మవిశ్వాసంతో వున్నా. ఐపీఎల్ లో బాగానే రాణించగలని నాకు నమ్మకం వుంది. ఈసారి జట్టులో తిరిగి స్థానం కల్పించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తాను’ అంటూ తెలిపాడు.
ఇక జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘కొంతకాలం నుంచి క్రికెట్ ని దూరమయ్యాను. మళ్లీ టీమిండియాలో వచ్చేందుకు తొలి అడుగు ఐపీఎల్ ద్వారా వేస్తున్నాను. ఈ టోర్నీలో నేను బాగానే రాణించగలనని ఆత్మవిశ్వాసంతో వున్నా’ అని నమ్మకం వ్యక్తం చేశాడు. అన్నట్లు.. యువీ, జహీర్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడుతున్నారు. వీరిలో యువీ రూ.16 కోట్లకు అత్యధిక ధర పలికిన విషయం విదితమే! మరి.. వీరిద్దరి ఈ సీజన్ లో ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాలి!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more