మహాత్మా గాంధీ, నేతాజీలపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభ ఓ తీర్మానాన్ని చేపట్టడంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు తీవ్ర స్థాయిలో స్పందించారు. కేవలం తీర్మానం ద్వారా తనను వ్యతిరేకించడం, శిక్ష విధించినట్టు కాదన్నారు. తనను కఠినంగా శిక్షించాలని, ఎలాంటి విచారణ లేకుండా ఉరితీయాలని పేర్కొన్నారు. ‘రాజ్యసభ తీర్మానం నన్ను శిక్షించడం కాదు. గాంధీ, నేతాజీలపై నేను చేసిన వ్యాఖ్యలకు నన్ను శిక్షించాల్సిందే. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిగా నాకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలనూ తొలగించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేశారు. అది అంత సులభం కాదు. అందుకు నియమ నిబంధనలను మార్చాల్సి ఉంటుంది’ అని కట్జు తన బ్లాగ్లో పేర్కొన్నారు. తాను భారత్కు తిరిగి వచ్చిన వెంటనే అరెస్టు చేసి ఉరితీసేలా తీర్మానాన్ని చేపట్టాలని గౌరవనీయ రాజ్యసభ సభ్యుల్ని కోరుతున్నానని అన్నారు. మహాత్మా గాంధీ బూర్జవా ఆలోచనలను వెలుగులోకి తెచ్చే విధంగా ఉన్న పండిట్ నెహ్రూ స్వీయ చరిత్రలోని కొన్ని వ్యాఖ్యలను కట్జు తాజాగా వెలుగులోకి తెచ్చారు.
అలా గాంధీ. నేతాజీ, నెహ్రూలనే కాదు అందరిపైనా ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మహ్మద్ జిన్నా గురించి కూడా ఓ ఆర్టికల్ రాశారు. మహ్మద్ జిన్నాను పాకిస్థాన్ వారు ఖయిది-ఇ-ఆజం అని పిలుస్తారు. దానికి అర్థం ప్రజల నాయకుడు అని, కానీ జిన్నాను అలా పిలవడానికి అర్హత ఉందా. అసలు అందులో వాస్తవం ఎంత అంటూ తాజాగా మరో ఆర్టికల్ రాయడంపై మరో సంచనానికి తెర తీసింది. మొత్తానికి మార్ఖండేయ ఖట్జూ అందరి మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాను మాత్రం ఎవరి మాటలకు భయపడేది లేదు అని చెప్పకనే చెబుతున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more