తెలంగాణలో మీడియా చానెళ్లపై ఆంక్షల పట్ల రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ వైఖరిని జాతీయ నేతలు కూడా తప్పుబడుతున్నారు. అయినా సరే ప్రభుత్వ వైఖరి మాత్రం మారటం లేదు. చానెళ్లపై నిషేదం ఎత్తివేత మాట అటుంచితే.., పాతరేస్తాం అని హెచ్చరిస్తున్నారు. మీడియాపై నిషేదం కేసీఆర్ వల్లనే వచ్చిందని అందరికి తెలుసు.. అయినా సరే ప్రభుత్వం మాత్రం తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. జర్నలిస్టులు దర్నాలు చేస్తే తీసుకెళ్ళి పోలిస్ స్టేషన్లలో పడేస్తున్నారు తప్ప పరిష్కారాలు చూపటం లేదు.
ఇంత ఖచ్చితంగా ప్రవర్తించటం ఎందుకని ప్రశ్నిస్తే అది సొంత బిడ్డల కోసమే అని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక్కడ సొంతబిడ్డలంటే సొంత మీడియా అన్నమాట. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ చానెళ్ళు ముందున్నాయి. అదే విధంగా ఆంధ్రజ్యోతి పత్రిక కూడా బాగానే అమ్ముడవుతోంది. అటు కేసీఆర్ -టీఆర్ఎస్ ఆధీనంలోని టీ. న్యూస్ ఛానెల్ ఎలక్రానిక్ మీడియాలో ఆశించిన స్థాయిలో రేటింగ్ పొందటం లేదు. అటు నమస్తేతెలంగాణ పత్రిక కూడా అంతంత మాత్రంగానే సర్య్కులేట్ అవుతోంది. ఈ రెండింటినీ పైకి తేవాలంటే పైన ఉన్న రెండిటీని కిందకు లాగాలని కేసీఆర్ ప్లాన్ చేసి వాటిపై నిషేధం పెట్టారని రేవంత్ రెడ్డి అంటున్నారు.
ఇలా తన మీడియా సంస్థలను లాభాల్లో నడిపేందుకు ఏబీఎన్, టీవీ9 లను నిషేధించారని రేవంత్ ఆరోపిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాటల్లో పూర్తి వాస్తవం ఉందని చెప్పలేము. కాని ఆయన ఆరోపించిన కోణం కూడా ఆలోచించరానిది కాదు. నిజంగా సొంత మీడియా బిడ్డల కోసమే కేసీఆర్ ఇలా చేసి ఉన్నారంటే మాత్రం ఆయన తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీడియా వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుందో వేచిచూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more