(Image source from: kannada director rishi files complaint on actress mythriya that they are already married before)
కన్నడ వర్థమాన నటి మైత్రేయి.. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ప్రస్తుత కేంద్రరైల్వేమంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడపై కేసు వేసిన సంగతి తెలిసిందే! దీంతో పోలీసులు అతనిమీద 420 చీటింగ్ కేసు నమోదు చేశారు. అతనిని వెంటనే లొంగిపోవాల్సిందిగా పోలీసులు అల్టిమేటం జారీచేసిన రోజునుంచి కార్తీక్ అడ్రస్ లేకుండా పరార్ అయ్యాడు. దీంతో ఇతనిమీద అనుమానాలు మరింత పెరిగిపోయాయి. కార్తీక్ నిజంగానే మైత్రేయిని మోసం చేసి పారిపోయాడంటూ పోలీసులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అతనికోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అయితే ఇంతలోనే పోలీసులకు కోలుకోలేని గట్టి షాక్ తగిలింది. సినిమాలో కంటే ఎక్కువగా ఈ ఉదంతంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఒకేసారి ఇన్ని ట్విస్టులు ఎదురుకావడంతో పోలీసులు సైతం గందరగోళ పరిస్థితిలో పడిపోయారు.
కార్తీక్ గౌడ సంగతి అటుంచితే.. మైత్రేయిని ఇంతకుముందే 2004వ సంవత్సరంలో తాను పెళ్లి చేసుకున్నానంటూ ఒక కన్నడ డైరెక్టర్ రిషి పోలీసులను ఆశ్రయించి సరికొత్త వివాదానికి తెరతీశాడు. 2004లో ‘‘సూర్య ది గ్రేట్’’ మూవీని చిత్రీకరిస్తున్న సమయంలో జూలై 17వ తేదీన శేషాద్రిపురంలోని సన్మాన్ లాడ్జిలో మైత్రేయి, తాను పెళ్లి చేసుకున్నామని రిషి చెబుతున్నాడు. అంతేకాదు.. వారిద్దరూ కలిసి దాదాపు నాలుగు నెలలు కాపురం కూడా చేశారని.. అనంతరం మైత్రేయి తన దగ్గరున్న 2 లక్షలు తీసుకుని ఉడాయించిందని షాకింగ్ స్టేట్ మెంట్లు పేర్కొన్నాడు. ఆరోజు నుంచి మైత్రేయి తనకు కనబడలేదని.. అయితే కార్తీక్ పై ఆరోపణలు చేస్తూ మీడియాకెక్కడం ద్వారా ఆమె మళ్లీ నాకంట పడిందని రిషి వాపోతున్నాడు. అందువల్లే తాను ఇన్నాళ్ల తర్వాత మైత్రేయి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అంతేకాదు.. మైత్రేయి తనతో కలిసున్న సందర్భంలోనూ తనకు తెలియకుండా దొంగచాటుగా తన బాయ్ ఫ్రెండ్స్ తో మైత్రేయి తిరిగేదని.. తనలాగే చాలామంది అబ్బాయిలు ఆ యాక్ట్రెస్ చేతిలో మోసపోయారని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే చాలామంది నిర్మాతల నుంచి ఆమె పెద్ద మొత్తంలో డబ్బులు గుంజినట్లు కూడా అతను ఆరోపణలు చేస్తున్నాడు.
ఒకవైపు కేంద్రమంత్రి కొడుకు మీద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టడంలో తర్జనభర్జన పడుతున్న పోలీసులకు.. అనుకోకుండా కన్నడ డైరెక్టర్ రిషి నటి మైత్రేయి మీద ఇటువంటి ఆరోపణలు చేయడంతో వారు పెద్ద షాక్ కే గురయ్యారు. రిషి రాకతో ఇప్పుడు మైత్రేయి కేసు మరో కొత్త మలుపు తిరిగింది. కేంద్రమంత్రి కొడుకుపైనే కేసు వేసిన నటి మైత్రేయి మీద రివర్స్ గా ఓ డైరెక్టర్ ఆమెపై ఆరోపణలు చేయడాన్ని చూస్తుంటే పలు అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. కార్తీక్ కే ఇదంతా వెనకుండి నడిపిస్తున్నాడంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా.. మైత్రేయి మాత్రం కార్తీకే తన భర్తంటూ వాపోతోంది. తన ఫ్రెండ్స్ కి ఈ విషయం తెలిసినప్పటికీ వారు చెప్పడానికి భయపడుతున్నారని చెబుతోంది. కార్తీక్ కారు డ్రైవర్ కి తమ ప్రేమ వివాహం గురించి తెలుసునని.. అతనే ఈ ఆపద నుంచి తనను కాపాడుతాడని ఆమె పేర్కొంటోంది. ఏదిఏమైనా.. డైరెక్టర్ రిషి ఎంట్రీ ఇది సంచలనంగా మారింది. ఇక్కడ ఎవర్నెవరు మోసం చేశారో.. ఎవరు మోసపోయారో..? ఎవరు నిర్దోషులో..? అనే విషయాల్లో మాత్రం అస్సలు క్లారిటీ రావడం లేదు. మరి ఈ చిక్కుముడిని పోలీసులు ఎలా విప్పుతారో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more