రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాకు సంబంధించి కొన్ని విషయాల్లో దెబ్బమీద దెబ్బ పడుతూనే వుంది. రైల్వే, కేంద్ర బడ్జెట్ లలో ప్రత్యేక హోదా ఏమీ ఇవ్వలేదంటూ ఆనాడు కేసీఆర్ మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే! అలాగే రైతుల రుణమాఫీల విషయంలోనూ ఆర్బీఐ ఎటువంటి సహాయం చేయదని స్పష్టం చేసింది. పైగా విద్యుత్తు కష్టాలతో చీకటి ముసుగులో మునిగిపోయింది. ఇలా అనేక విధాలుగా కష్టాలను ఎదుర్కుంటున్న తెలంగాణాకు ఇప్పుడు మరో షాక్ తగిలినట్టు తెలుస్తోంది. ఇదేమీ అంత పెద్ద విషయం కాకపోయినా.. తెలంగాణవారికి మాత్రం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.
ఏపీ దేవదాయశాఖ మంత్రి అయిన మాణిక్యాలరావు.. దేవాలయాల్లో పాలకమండళ్లను రెండువారాల్లో నియమిస్తామని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ విషయంలో కుండబద్ధలు కొట్టారు. ఈ అంశంపై సోమవారంనాడు హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. టీటీడీకి స్పెసిఫైడ్ అథార్టీ కమిటీని నియమించే యోచన లేదని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2వ వారంలో టీటీడీ పాలకవర్గం నియామకంతోపాటు వచ్చే నెలాఖరుకల్లా అన్ని దేవాలయాల పాలకవర్గాలను నియమిస్తామని ఆయన అన్నారు. టీటీడీలో సభ్యుల సంఖ్య 15 నుంచి 18 వరకు పెంచుతామని ఆయన వెల్లడించారు.
అలాగే ప్రతి దేవాలయ కమిటీలో ఇద్దరు సభ్యులు, ఒక ఎక్స్ అఫిషియో మెంబర్ పెంపు కూడా ఖచ్చితంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే వుంది కానీ... టీటీడీ పాలకవర్గంలో తెలంగాణకు ప్రత్యేక కోటా ఏమీలేదని ఆయన తేల్చి చెప్పారు. నిన్నమొన్నటివరకు కేవలం ప్రాంతాలవారీగా గొడవ పడ్డ ఆంధ్ర, తెలంగాణ మంత్రులు.. ఇప్పుడు దేవుడికి సంబంధించి విషయాల్లోనూ గొడవలు పడాల్సి వస్తున్న పరిస్థితి వచ్చేసింది. మరి దీనిపై తెలంగాణ మంత్రులు ఎలా స్పందించనున్నారో..? ఇది ఎంత పెద్ద దుమారాన్ని రేపుతుందో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more