దేశంలో ఎక్కడున్నా, ఎప్పుడైనా బిల్లులను చెల్లించే విధానానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారాలు తెరుస్తోంది. అందుకు గురువారం మార్గదర్శకాలను వెల్లడి చేసిన రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 5 లోపులో అభిప్రాయాలను కోరుతున్నట్లుగా తెలియజేసింది.
భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బిబిపిఎస్) ను అమలు చెయ్యటానికి ఆర్ బి ఐ రూపొందించిన మార్గదర్శకాలలో, నగదు, చెక్ ఇలా ఏ రూపంలోనైనా బిల్లుల చెల్లింపులను చెయ్యటానికి వెసులుబాటు కలిగిస్తోంది. ఆర్ బి ఐ అంచనా ప్రకారం దేశంలోని 20 నగరాలలో సంవత్సరానికి 30800 మిలియన్ బిల్లుల చెల్లింపులు 6 లక్షల కోట్ల రూపాయల మేరకు జరుగుతున్నాయి.
ఇందులో రకరకాల వినియోగదారుల బిల్లులు, స్కూల్ ఫీజ్, యూనివర్శిటీ ఫీజ్, మునిసిపల్ టాక్సెస్ ఉన్నాయి. కానీ వాటితో అనుసంధానం లేకపోవటం వలన అన్ని చోట్ల నుంచి పేమెంట్స్ చెయ్యలేకపోతున్నారని, దాన్ని అధిగమించి ఏజెంట్ల ద్వారా ఈ పేమెంట్లను చెయ్యగలిగితే దేశంలో ఎక్కడినుంచైనా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చునని ఆర్ బి ఐ చెప్తోంది.
బిల్లుల సెటిల్ మెంట్, కస్టమర్ల అభ్యంతరాల పరిశీలన, బాధ్యతలు ఇలాంటి విషయాలలో ఆర్ బి ఐ స్పష్టత తీసుకునివచ్చే ప్రయత్నం చేస్తోంది. ఏజెంట్ల ద్వారా వివిధ రూపాలలో చేసే ఈ బిల్లు చెల్లింపులను తక్షణ ధృవీకరణ చేసే విధంగా ఎలక్ట్రానిక్ అనుసంధానం కలిగివుండేట్టుగా ఈ బిబిపిఎస్ కింద భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ (బిబిపిఓయు) లు పనిచేస్తాయి.
ఇలా బిల్లు చెల్లింపులను ఎక్కడినుంచైనా చెయ్యటం కోసం సురక్షితమైన విధానాన్ని నెలకొల్పాలని కోరుతున్న రిజర్వ్ బ్యాంక్, ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్లు కొన్ని అమలులో ఉన్నా, అవి అన్ని రకాల బిల్లుల చెల్లింపుల విషయంలో కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలను అందించలేకపోతున్నాయని అంటోంది.
బిల్లు చెల్లింపుల విషయంలో కావలసినవి- ఏ విధమైన చెల్లింపులనైనా స్వీకరించటం, తక్షణ ధృవీకరణ, సురక్షితమైన విధానం. వీటిని సాధించినట్లయితే రిజర్వ్ బ్యాంక్ కోరుకున్నట్లుగా అన్ని రకాల బిల్లుల చెల్లింపులూ కేంద్రీకృతమైన ఆన్ లైన్ విధానంలోకి రావటమే కాకుండా ఇ సేవ, మీ సేవ లాంటి ఉపాధి కల్పన కూడా జరుగుతుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more