రాష్ట్రంలో తెలంగాణా ప్రాంతానికి నామినేషన్లు దాఖలు చెయ్యటానికి ఈ రోజు ఆఖరు తేదీ అయినా తొలి జాబితా విడుదల చేసిన భారతీయ జనతా పార్టీ ఇంకా కొన్ని స్థానాలను ప్రకటించవలసివుంది.
తెలుగు దేశం పార్టీతో 8 లోక్ సభ, 47 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎన్నికలలో పోటీకి నిలబెట్టటానికి ఒప్పందం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు 8 లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇంకా 26 స్థానాలకు ప్రకటించటం బాకీ ఉంది.
తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు లేదు. సీనియర్ నాయకులు విద్యాసాగర రావు కరీం నగర్, భండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ స్థానాలలో వారి పాత స్థానాలే దక్కించుకున్నారు. తెలంగాణా నగారాను విలీనం చేసి భాజపాలో కొత్తగా చేరిన నాగం జనార్దన రెడ్డి కి ఆయన కోరుకున్న మహబూబ్ నగర్ టికెట్ లభించింది. తెరాస నుంచి నిరసనతో బయటకు వచ్చి భాజపాలో చేరిన రఘునందన రావుకి దుబ్బాక అసెంబ్లీ సీట్ లభించింది.
ఈరోజు ఉదయానికల్లా మిగతా జాబితా కూడా భాజపా విడుదల చెయ్యవలసి ఉంది. తెరాస నుంచి నిరసనతో బయటకు వచ్చి భాజపాలో చేరిన రఘునందన రావుకి దుబ్బాక అసెంబ్లీ సీట్ లభించింది.
తెదేపాతో పొత్తులో ఇంకా నిర్ణయం కాకుండా ఉన్న సీట్ల వలన రెండవ జాబితాలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్న బోధ్ శాసనసభ స్థానాన్ని మాధవి సుమలతకి కేటాయించినట్లు ప్రకటించినా, అది తేదేపా కు పోయేట్టుగా ఉంది. అక్కడ మాజీ ఎంపీ కుమారుడు కేశుపల్లి ఆనందరెడ్డికి ఆ సీట్ ఖరారు అయ్యే అవకాశం ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more