పెరుగుతున్న టెక్నాలజీతో సమాజంలో చేడు విపరీతంగా పెరిగిపోతుంది. మొన్నటి వరకు బ్రహ్మనందం పై కామెడీ ఫోట్లో మార్పింగ్ చేసి , ఇంటర్ నెట్ లో పెడితే వాటిని చూసి ప్రజలు నవ్వుకున్నారు. ఆ తరువాత చిరంజీవి, బాలక్రిష్ణల మీద అసభ్యంగా ఫోటోలు మార్పింగ్ చేసి వెబ్ సైట్ లలో వదిలారు. వాటిని బాలయ్య సీరియస్ తీసుకోవటంతో .. ఇప్పుడు వాటికి బ్రేక్ పడింది. తాజాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో తో జిమ్మిక్కులు చేస్తున్నారు. రోజురోజుకి విప్లవాత్మకమైన మార్పులతో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పలు రకాలుగా దుర్వినియోగం కూడా అవుతోంది. తెలంగాణకు చెందిన ఓ వెబ్సైట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఫోటోను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సృష్టించారని, అంతేగాక, పరుషపదజాలంతో దూషించే విధంగా వ్యాఖ్యలు చేసిన బాధ్యులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దినేని అజయ్ సైబర్క్రైమ్ డిప్యూటీ డైరెక్టర్ జాఫర్ జావెద్కు ఫిర్యాదు చేసినట్లు తెల్సింది. అయితే మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన పదజాలంతో ఉన్న కామెంట్లు తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి సంఘం పేరిట ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఫిర్యాదు ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోను ఈ రకంగా అసభ్యకరంగా చిత్రీకరించటం పట్ల తెలంగాణ ప్రజలు సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు బిక్కునాయక్, అశోక్ముదిరాజ్, చందూ తదితరులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more