రాయలసీమ ప్రముఖ నాయకుడు, కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. తన సొంత జిల్లా కర్నూలుకు నీటి కేటాయింపులలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఎస్పీవై రెడ్డి తన రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్కు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆయన తన ఎంపీ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎస్పీవై రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈయన నీటికేటాయింపులను సాకుగా చూపి రాజీనామా చేసే యోచనలో ఉన్నా, అంతర్గతంగా మాత్రం పార్టీ భవిష్యత్ గురించి అలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. తన పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. త్వరలో ఈ విషయం పై వైయస్ విజయమ్మను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒక వేళ ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీకి కర్నూలు జిల్లాలో పెద్ద దెబ్బతగిలినట్లేనని భావించవచ్చు.
తను పార్టీ మారుతున్నాని వస్తున్న వార్తల పై స్పందించిన ఎస్పీవై రెడ్డి ఆ వార్తలను ఖండించారు. తాను రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అంటున్నారు. అయితే రాజకీయంలో ఏ క్షణానికి ఏమి జరుగునో మనం ఊహించలేం కాబట్టి ఎస్పీవై రెడ్డి కాంగ్రెస్ లో ఉంటాడా ? వైయస్సార్ సీపీలో చేరుతాడా అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more