ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తాజా సీజన్ పై నీలిమబ్బులు కమ్ముకుంటున్నాయి. ఈ సీజన్ను రద్దు చేయక తప్పని పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్త లాక్డౌన్ను మే 3 వరకు పొడగించారు. కరోనా మహమ్మారిని దేశం నుంచి శాశ్వతంగా పారద్రోలే క్రమంలో లాక్ డౌన్ కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎత్తివేయకుండా అంచెలవారీగా ఎత్తివేస్తారన్న సంకేతాలను ఇప్పటికే కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు భారీస్థాయిలో జనసమీకరణలు జరిగే ప్రాంతాల్లపై లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా అంక్షలు కొనసాగే అవకాశాలున్నాయన్నవార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తాము తదుపరి నోటీసులు జారీ చేసేంత వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వాయిదా వేస్తున్నామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ వుంటుందా.? అన్న అభిమానుల ప్రశ్నలు కూడా ఉవ్వెత్తున్న వినిపిస్తున్నాయి, ‘కొవిడ్ వైరస్ ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ నోటీసులు జారీ చేసేంతవరకు ఐపీఎల్-2020ని వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది’ అని బోర్డు కార్యదర్శి జే షా ప్రకటించారు.
దేశంలో క్రికెట్ను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించగా ‘ఎప్పుడు ఆరంభించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సంఘాలతో కలిసి బీసీసీఐ నిరంతరం సమీక్షిస్తుంది. ఆ తర్వాతే నిర్ణయం ఉంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. మొదట ఐపీఎల్ను ఏప్రిల్ 15కు వాయిదా వేశారు. లాక్డౌన్ను పొడగించడంతో మళ్లీ నోటీసులు ఇచ్చేంతవరకు సీజన్ను నిరవధికంగా వాయిదా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐకి సెప్టెంబర్-నవంబర్ విండో మాత్రమే మిగిలింది. అప్పుడు సీజన్ను ఆరంభించాలన్నా దుబాయ్లో ఆసియా కప్కు దూరమవ్వాలి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more