దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్కు కోర్టులో ఊరట లభించింది. పిస్టోరియస్ దేశం విడిచిపోకుండా ఉంటాడన్న అతని తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించిన జడ్జి లెడ్వాబా 500 యూరోల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేశారు. ఎలక్ట్రికల్ టాగ్ను అతనికి అమర్చి ఇంటికి 20 కిలో మీటర్లో దూరంలో మాత్రమే వెళ్లే అవకాశం కల్పించారు. అతని పాస్ పోర్టును కూడా స్వాధీనం చేకసుకోవాలని కోర్టు సూచించింది.
అయితే పిస్టోరియస్ను దోషిగా తేలుస్తూ సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కాన్సిట్యూషనల్ కోర్టులో అప్పీల్ చేయనున్నట్టు అతని తరఫు న్యాయవాది తెలిపారు. పిస్టోరియస్ ఉద్దేశపూర్వకంగానే తన ప్రియురాలు రీవా స్టీన్కాంప్ను హత్య చేసినట్టుగా ఆదేశ సుప్రీం కోర్టు తేల్చింది. బాత్రూమ్లో తలుపు వెనకాల స్టీన్కాంప్ కానీ ఆగంతకుడు కానీ ఎవరున్నా తుపాకీతో కాల్చితే కచ్చితంగా మరణిస్తారని పిస్టోరియస్కు తెలుసని జడ్జి అభిప్రాయపడ్డారు. అతడికి తొలుత స్థానిక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించిన విషయం తెలిసిందే.
అయితే ఆ తీర్పు దోషపూరితంగా ఉందని, అతడికి కఠిన శిక్ష వేయాల్సిందేనని స్పష్టం చేస్తూ కేసును ట్రయల్ కోర్టుకు తిప్పి పంపింది. దీంతో 15 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశాలుండటంతో పిస్టోరియస్ తిరిగి సుప్రీం కోర్టు తీర్పును సవాలు చేస్తూ కాన్సిట్యూషనల్ కోర్టులో అప్పీల్ చేయనున్నాడు. స్థానిక కోర్టు విధించిన జైలు శిక్షలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న తను అక్టోబర్లో పెరోల్పై విడుదలై గృహ నిర్భందంలో ఉండేందుకు కోర్టు అనుమతించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more