క్రికెట్ ప్రపంచకప్ టార్నమెంటు లీగ్ దశలో భాగంగా మెల్బోర్న్ వేదికగా బంగ్లాదేశ్ శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్తో సంగక్కర 400 వన్డేలు ఆడిన ఆటగాళ్ల క్లబ్లో చేరిపోయాడు. జట్టులో బ్యాట్స్మెన్గా, వికెట్ కీపర్గా, కెప్టెన్గా పలు పాత్రలు పోషించాడు. ఈ 37ఏళ్ల శ్రీలంక ఆటగాడు తొలిసారి 2000 సంవత్సరంలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. వన్డేల్లో ఇప్పటివరకు 21 సెంచరీలు, 93 అర్ధసెంచరీలు చేసిన సంగక్కర 13,739 పరుగులు చేశాడు. 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 169 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అదే విధంగా 130 టెస్టులాడి 12,203 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 319గా సంగక్కర నమోదు చేశాడు
ఈ 400 క్లబ్ లో చేరిన నాల్గవ ఆటగాడిగా ఆయన తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్లబ్ లో చేరిన వారిలో ముందు వరుసలో నిలిచింది భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఆయన 463 మ్యాచ్ లు ఆడి 18 వేల 426 పరుగులు చేశాడు. తన సుదీర్ఘ పయనంలో 49 సెంచరీలను నమోదు చేసిన సచిన్ అత్యధిక వ్యక్తిగత స్కోరును 200 గా దక్షిణాప్రికాపై నమోదు చేశారు. కాగా ఈ క్లబ్ లో చేరిన మిగిలిన ముగ్గురు ఆటగాళ్లు లంకేయులు కావడం గమనార్హం. జయసూర్య అత్యధికంగా 445 మ్యాచ్ లు ఆడి 13, 430 పరుగులను సాధించి 28 సెంచరీలను సాధించగా. అత్యధిక వ్యక్తిగత స్కోరును 189గా నమోదు చేశాడు.
ఆ తరువాత జయవర్దనే 444 మ్యాచ్ లతో నాలుగువందల క్లబ్ లో నిలిచి 12 వేల 625 పరుగులు సాధించాడు. 144 అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసిన జయవర్దనే 19 సెంచరీలను కూడా నమోదు చేశాడు. సంగక్కర ఇవాళ్టి మ్యాచ్ తో 400 క్లబ్ లో చేరగా, ఇప్పటి వరకు ఆయన 13 వేల 739 పరుగులు సాధించాడు. ఈ సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఆయన 21 సెంచరీలతను సాధించగా, తన వ్యక్తిగత స్కోరుగా 169 పరుగులను సాధించాడు. ఇక అటు టెస్టు మ్యాచ్ లలో నూ సంగక్కరా బంగ్లాదేశ్ జట్టుపైనే తన ప్రతాపం చూపి 400 పరుగులు చేసి 400 క్లబ్ లో చేరిన క్రికెటర్ గా కూడా రికార్డు సాధించిన విషయం తెలిసిందే.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more